Big Stories

Stone Attack on Chandrababu: చంద్రబాబుపై దాడికి యత్నం.. రాయిని విసిరిన ఆగంతకుడు

Stone Attack on Chandrababu in Vishaka Praja Galam Sabha: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖలోని గాజువాకలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చేటుచేసుకుంది. చంద్రబాబుపైకి ఓ వ్యక్తి రాయి విసిరాడు.

- Advertisement -

చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు. చంద్రబాబు ప్రసంగిస్తున్న ప్రజాగళం వాహనం వెనుకుండి ఆ దుండగుడు రాయిని విసిరాడు. అయితే రాయిని విసిరిన ఆగంతకుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే తనపై రాళ్లు విసరడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

నిన్న విజయవాడలో జగన్ ప్రసంగిస్తుండగా అతనిపై గులరాయి పడిందని చంద్రబాబు తెలిపారు. అయితే జగన్ పై రాయిని విసిరినప్పుడు కరెంట్ లేకపోగా.. కరెంట్ ఉన్నప్పుడే తనపై రాళ్లు విసిరారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడికి యత్నించింది.. గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ పనేనని అన్నారు. పవన్ కళ్యాణ్ పైన కూడా తెనాలిలో రాళ్లతో దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడలో నిన్న జరిగిందంతా.. ఓ హైడ్రామా అని, దాని లెక్కలు త్వరలోనే తేలుస్తాని చంద్రబాబు వైసీపీని హెచ్చరించారు.

Also Read: Chandrababu: విశాఖను వాణిజ్య రాజధాని చేస్తాం.. ఉత్తరాంధ్రులకు చంద్రబాబు కీలక హామీ

క్లైమోర్ మైన్స్ కే భయపడలేదు.. ఈ రాళ్లకు భయపడతానా అని చంద్రబాబు అన్నారు. నిన్న జగన్ పై జరిగిన దాడికి పోలీసులు కరెంట్ కట్ చేసిన వారిపై, రాయి వేసిన వారిపై చర్యులు తీసుకోవాలని అన్నారు. కానీ వారు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీ, డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News