E-Paper
Advertisement

AP Legislative Council : ఏపీ మండలిలో పార్టీల బలాబలాలేంటి?..

AP Legislative Council : ఏపీ మండలిలో పార్టీల బలాబలాలేంటి?..
Advertisement

AP Legislative Council: ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. సాధారణ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ, టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఓటర్ పల్స్ ను స్పష్టంగా తెలియజేస్తున్నాయిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 3 పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని పండగ చేసుకుంటున్న టీడీపీకి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక స్థానం దక్కడంతో ఆ పార్టీలో జోష్ మరింత పెరిగింది. ఈ ఫలితాలతో వైసీపీలో అంతర్మథనం మొదలైంది.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో పార్టీల బలాబలాలు మారాయి. మండలిలో మొత్తం 58 సభ్యులున్నారు. తాజాగా 21 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 17 స్థానాలు వైసీపీకి దక్కాయి. 4 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది.

Advertisement

ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మండలిలో వైసీపీకి 33 మంది సభ్యులున్నారు. వారిలో ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజాగా 17 స్థానాలు గెలవడంతో ఆ పార్టీ బలం 43కు పెరిగింది. గవర్నర్ కోటాలో ఇద్దరు సభ్యులు వైసీపీ నుంచి ఎన్నికకానున్నారు. దీంతో వైసీపీ సభ్యుల సంఖ్య 45కు చేరుకోనుంది.

తాజా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు టీడీపీ సభ్యుల సంఖ్య 17. ఆ పార్టీకి చెందిన 11 మంది సభ్యుల్లో కొందరి పదవీకాలం ఈ నెలాఖరుకు, మరికొందరి పదవీకాలం మే నెలాఖరుతో పూర్తికానుంది. అయితే తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి కొత్తగా నలుగురు మాత్రమే గెలిచారు. దీంతో టీడీపీ బలం ఇప్పుడు 10కి తగ్గనుంది.

Advertisement

ఇప్పటి వరకు మండలిలో పీడీఎఫ్‌కు ఐదుగురు సభ్యులుండగా .. తాజా ఎన్నికల తర్వాత వారి సంఖ్య మూడుకు పరిమితమైంది. బీజేపీకి ఉన్న ఒక్క సభ్యుడూ ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×