Sugali Preethi: ఎపీలో ఒకప్పుడు సుగాలి ప్రీతి మరణం కేసు సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి న్యాయం కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ప్రస్థుతం మల్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోరుతున్నారు.
ఈ కేసుకు సంభందించి ప్రస్థుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కృష్ణా జిల్లాలోని గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇప్పడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పార్వతి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు ఎన్నికలకు ముందు న్యాయం చేస్తాని చెప్పిన పవన్ కళ్యాణ్, ఇప్పడు మాట తప్పుతున్నారని పార్వతి పేర్కోన్నారు. కేసుకు సభందించి ఆదారాలు లేవంటూ చెప్పుతున్నారని తల్లి ఆరోపిస్తున్నారు.
Also read: Tender Scam: టెండర్ల కోసం ఎంతకైనా తెగిస్తారా.. పేదల బియ్యంపై మిల్లర్లు అరాచకం!
ఎన్నికల్లో గెలవక ముందు ఒకలా, గెలిచాక మరోలా మాట్లాడుతున్నారని పార్వతి మండిపడ్డారు. దీనికి సభందించి ఆమేకు న్యాయం కావాలంటూ భాదితురాలి తల్లి పవన్ కళ్యాణ్ పై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులను FIR నమోదు చేయాలని పార్వతీ కోరారు. మరణిచిన తన కూతురి కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నాకు తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసారు.
Also read: POCSO Cases: తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న పోక్సో కేసులు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాకే..?