E-Paper
Advertisement

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. టెర్రరిస్టులపై ఉపయోగించే చట్టం, ఏపీ హైకోర్టులో పిటిషన్

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. టెర్రరిస్టులపై ఉపయోగించే చట్టం, ఏపీ హైకోర్టులో పిటిషన్
Advertisement

Amaravati: ఏపీని రోజుకో అంశం కుదిపేస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది.  ఈ కేసు దర్యాప్తు జోరుగా చేస్తోంది సిట్. ఇదే సమయంలో ప్రశ్న రావణ్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఒక కేసులో బెయిల్ రాగానే మరొక కేసులో అరెస్ట్ చేయడం మద్దతుదారులకు మింగుడు పడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రశ్నరావణ్ నేరుగా ఏపీ హైకోర్టు తలుపు తట్టాడు. అసలేం జరిగింది?

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు

Advertisement

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌లపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వరుస అరెస్టులను ఎదుర్కొంటున్నాడు యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. తాజాగా ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను కలిపి ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో ప్రస్తావించాడు.

ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ- CBIతో విచారణ జరిపించాలని అందులో ప్రస్తావించాడు. రావణ్ వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. రావణ్ తన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. అంతేకాదు ఆయనపై పాయకరావుపేట, పిఠాపురం,మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్లను ప్రతివాదులుగా పేర్కొన్నట్లు సమాచారం.

Advertisement

ఏపీ హైకోర్టులో పిటిషన్.. అన్నింటిని ఒకే కేసు కింద విచారించాలని పిటిషన్

ప్రశ్న రావణ్ పై రాజద్రోహం కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. రావణ్‌పై గన్నవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు జనసేన నేత, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్. ఆయన ఫిర్యాదుతో రావణ్ పై U/s 147,148,152,192,197(1)(d),353(1)(b) & Sec 13, 39 చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం 1967 (UAPA Act) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టడం, సమగ్రతకు భంగం కలిగించేలా చర్యలు చేపట్టడం వంటి సెక్షన్లు నమోదు చేశారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం, దేశద్రోహ పూరిత, తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.  జూన్ 28న  రాత్రి 9 గంటల సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

ALSO READ:  తెలంగాణలోని లేని అందాలు ఏపీలో ఉన్నాయి.. చిత్ర పరిశ్రమకు మంత్రి దుర్గేశ్ బంపరాఫర్

గన్నవరం కేసు విషయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కేను నమోదు అయినట్టు ఉంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై టెర్రరిస్టులపై ప్రయోగించే UAPA చట్టం కేసు నమోదు చేసింది ఏపీ ప్రభుత్వం.  కస్టడీలో ఆహారం మానేసి నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించాడు ప్రశ్న రావణ్. సాయికృష్ణ మాదిరిగా కస్టడీలో చంపాలనుకుంటే దీక్షలో ప్రాణాలు వదులుతానని ప్రస్తావించాడు. తనను చంపగలరు కానీ.. ప్రశ్నలను చంపలేరని, తాను చనిపోయినా ప్రశ్నలు వస్తూనే ఉంటాయన్నాయని హెచ్చరించాడు.

Related News

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×