E-Paper
Advertisement

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు ఆలస్యమా? చివరి తేదీపై అసలు నిజం ఇదే!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు ఆలస్యమా? చివరి తేదీపై అసలు నిజం ఇదే!
Advertisement

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం కింద మీరు అర్జీ పెట్టారా? లేదా పెట్టాలని చూస్తుంటే.. రేపే చివరి తేదీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు చూస్తూ కంగారుపడుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ముఖ్యంగా, ఈ పథకం ద్వారా మీ తల్లికి రూ. 13 వేలు జమ చేయాలని చూస్తున్న మీలాంటి వారికి తాజాగా ప్రభుత్వం నుంచి ఓ స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం తల్లికి వందనం అర్జీకి రేపే చివరి తేదీ అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. ప్రభుత్వ అధికారిక వర్గాల ప్రకారం, అర్జీ వేసే చివరి తేదీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో, చివరి తేదీ నిర్ణయించిన వెంటనే అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టంగా తెలిపింది. దాంతో, ఎవ్వరు అర్హులైతే తప్పకుండా అర్జీ పెట్టుకోండి. అయితే అంతవరకు వేచి చూడొద్దు, అర్హత ఉందని అనుకుంటే ఇప్పుడే మీ సచివాలయంలో దరఖాస్తు పూర్తిచేసేయండి.

Advertisement

ఏవీ నిజం కాదు – అవే అపోహలు!
ఇటీవల ఈ రోజు లేదా రేపే తల్లికి వందనం పథకానికి చివరి తేదీ, ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోకపోతే డబ్బులు రావు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఎందుకంటే ఇవి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనలు కావు. ప్రజలను భయపెట్టి హడావుడిగా అర్జీలు వేయించే ప్రయత్నాలు కొన్ని వర్గాలవే.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రభుత్వం ఏ పథకం గురించి స్పష్టత ఇస్తుందో, అధికారిక వెబ్‌సైట్లలో, గ్రామ సచివాలయాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం విషయంలో కూడా అదే జరుగుతుంది.

Advertisement

అర్జీ ఎలా పెట్టాలి?
తల్లికి వందనం స్కీమ్ ద్వారా డబ్బులు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, మీ ఖాతాలో డబ్బులు జమ కాని పక్షంలో మీరు అర్జీ సమర్పించేందుకు ప్రభుత్వం గ్రీవెన్స్ కు అవకాశం ఇచ్చింది. దీనితో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా సచివాలయాలలో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బులు జమ కాని తల్లులు గ్రీవెన్స్ లో అర్జీలు సమర్పిస్తున్న పరిస్థితి.

Also Read: Nizamabad VDC Controversy: పెదరాయుడిలా తీర్పులు.. కట్ చేస్తే కటకటాల్లోకి.. ఆ జిల్లాలో ఏమైందంటే?

డబ్బులు జమ కావడం ఆలస్యం అయితే?
అర్జీ వేయగానే వెంటనే డబ్బులు జమవుతాయని కొందరు భావిస్తున్నారు. కానీ అసలు వ్యవస్థ అలా కాదు. అర్జీ వేశాక దానిపై అధికారుల పరిశీలన, అర్హత పరిశీలన జరుగుతుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది. ఇది కొన్ని వారాలు పట్టవచ్చు. అయితే జమ కాకపోతే సచివాలయాన్ని సంప్రదించవచ్చు. వారు మీ డబ్బుల స్థితి చెప్పగలుగుతారు.

చివరి తేదీపై స్పష్టత ఎప్పుడుంటుంది?
ప్రస్తుతం ఏదైనా తుది తేదీ ఉందని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలోనే పూర్తి వివరాలతో ఆ తేదీని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. దాంతో పాటు ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్, గ్రామ సచివాలయాల ద్వారా సమాచారం అందించనుంది.

మిగతా అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి?
మీరు “తల్లికి వందనం” పథకంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయం లేదా ప్రభుత్వ పబ్లిక్ డొమెయిన్ వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. తల్లికి వందనం అన్నదే గొప్ప భావన. కానీ అర్జీ చివరి తేదీ అంటూ వస్తున్న పుకార్లను నమ్మకండి. ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. అర్హత ఉంటే ఇప్పుడే అర్జీ పెట్టుకోండి.. కానీ దూకుడుగా కాకుండా పూర్తి సమాచారం తెలుసుకుని అడుగులు వేయండి. ప్రభుత్వ పథకాల్లో నమ్మకంతో ముందుకు వెళ్లినప్పుడే.. అది నిజమైన వందనం అవుతుంది!

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×