E-Paper
Advertisement

AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి

AP Govt: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి
Advertisement

AP Govt: ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా ఖాతాలకు జమ కాకుండా ఉన్న నగదును తక్షణం వారి వారి ఖాతాలలో జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. గత పది నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యను తక్షణం కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా దివ్యాంగ చిన్నారులకు, మానసిక వైకల్య బాధిత పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు భవిత కేంద్రాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ భవిత కేంద్రాల ముఖ్య లక్ష్యం.. దివ్యాంగ చిన్నారులలో మానసిక స్థైర్యం కల్పించడంతో పాటు, వారికి ప్రత్యేక శిక్షణ అందించడమే. ఈ కేంద్రాలు దివ్యంగా చిన్నారులకు వరంగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రతినెల తమ చిన్నారులను విధిగా వారి తల్లిదండ్రులు కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంది. అందుకై రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. ఒక్కొక్క విద్యార్థికి నెలకు రూ. 300 చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలను అందజేయాలి.

Advertisement

కానీ 10 నెలలుగా దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రుల ఖాతాకు డబ్బులు జమ కాకపోవడంతో, పలువురు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు.. దివ్య అంటే చిన్నారులకు అందించే డబ్బులు జమలో సైతం గత ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించిందా అంటూ అధికారులను నిలదీశారు. ఎన్ని నెలలు బకాయిలు ఉంటే అన్ని నెలల డబ్బులను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Also Read: AP Govt – TG Govt: ఆ విషయంలో తెలంగాణను ఫాలో అవుతున్న ఏపీ

Advertisement

దీంతో పది నెలలుగా బకాయి పడ్డ రవాణా చార్జీల నగదును ఒక్కొక్కరికి రూ. 3000 చొప్పున ప్రభుత్వం జమ చేసింది. తమ కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం నగదును ఖాతాలకు జమ చేయడంపై దివ్యాంగ తల్లిదండ్రులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మరి మీ ఖాతా ఒకసారి చెక్ చేసుకోండి.. నగదు జమ అయిందో కాలేదో సరిచూసుకోండి.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×