E-Paper
Advertisement

Yuvagalam: 200 మంది సెక్యూరిటీ.. 400 మంది వాలంటీర్లు.. లోకేశ్ చుట్టూ పసుపువ్యూహం

Yuvagalam: 200 మంది సెక్యూరిటీ.. 400 మంది వాలంటీర్లు.. లోకేశ్ చుట్టూ పసుపువ్యూహం
Advertisement

Yuvagalam: నారా లోకేశ్ పాదయాత్ర. యువగళం పేరుతో 400 రోజుల పాటు యాత్ర. ఏకంగా 4000 కిలోమీటర్ల ప్రయాణం. కుప్పం టు ఇచ్చాపురం. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచీ ఒకటే డౌట్. యువగళానికి లోకేశ్ సిద్ధమవుతున్నా.. ఆయన్ను సజావుగా యాత్ర చేయనిస్తారా? అనే అనుమానం. ఎందుకంటే, టీడీపీ అధినేత చంద్రబాబుపైనే రాళ్లు వేసిన ఘటనలు ఉన్నాయి. చంద్రబాబును కుప్పంలోనే అడ్డుకున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇలాంటి హార్డ్ కోర్ పాలిటిక్స్ నడిచే ఏపీలో.. లోకేశ్ ను అంతదూరం పాదయాత్ర చేయనిస్తారా? మధ్యలో వైసీపీ శ్రేణులు ఆటంకాలు కలిగిస్తారా? అనే అనుమానం అందరిలోనూ. టీడీపీలోనూ.

అందుకే, ఎందుకైనా మంచిదని యువగళం కోసం సొంతంగా భారీ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేసుకుంది టీడీపీ. ఏకంగా 200 మందిని లోకేశ్ వ్యక్తిగత భద్రత కోసం నియమించుకున్నారు. 400 రోజుల పాటు యాత్రలో అలర్ట్ గా ఉండేలా.. 400 మంది చురుకైన వాలంటీర్లు నిత్యం లోకేశ్ వెంటే కొనసాగనున్నారు.

Advertisement

ఏపీలోని పలు జిల్లాలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలను గుర్తించిన టీడీపీ.. వారిని యువగళం వాలంటీర్లుగా నియమించింది. వారి కోసం లోకేశ్‌ బస చేసే ప్రాంతంలో ప్రత్యేకంగా జర్మన్‌ షెడ్లు వేసి వసతి కల్పిస్తుంది. భోజనాలు కూడా అక్కడే.

పాదయాత్ర జరిగే 400 రోజులూ కాన్వాయ్‌లోనే లోకేశ్‌ విశ్రాంతి తీసుకుంటారు. ఆ పక్కనే వాలంటీర్ల బస ఉంటుంది. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడినా, దాడులకు దిగినా, సడెన్ గా జరగరానిదేమైనా జరిగినా.. వెంటనే ఆ వాలంటీర్లు స్పందించేలా ఈ ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇలా మందిమార్బలంతో నారా లోకేశ్.. 400 రోజుల పాటు, 4000 కిలోమీటర్లు దూరం.. 400 మంది వాలంటీర్లు.. 200 మంది సెక్యూరిటీతో.. యువరాజు కదిలే… అన్నట్టుగా యువగళం కొనసాగనుంది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×