E-Paper
Advertisement

Bail to Chandra babu naidu: చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

Bail to Chandra babu naidu: చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు
Advertisement
Bail to Chandra babu naidu

Chandra babu naidu latest news(AP political news) :

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అంగళ్ల కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న ఆయనకు లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం చంద్రబాబును పలు కేసులు వెంటాడుతున్న తరుణంలో బెయిల్‌ మంజూరుతో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.

యుద్ధభేరీ పేరుతో చంద్రబాబు సాగునీటి కోసం ప్రాజెక్టులను సందర్శించారు. టూర్‌లో భాగంగా ఆగస్ట్‌ 14న అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా వెళ్తుండగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో విధ్వంసం సృష్టించారని ఆరోపిస్తూ చంద్రబాబుతోపాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చిన పోలీసులు.. హత్యాయత్నంతోపాటు ఇతర సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ నేతలు. ఇందులో పలువురికి ఇప్పటికే బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. ఏ1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వైపుల వాదనలు విన్న తర్వాత లక్ష రూపాయల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

ఇక ఇప్పటికే స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ కేసుతో పాటు పలు కేసులు కూడా ఆయనను వెంటాడుతున్నాయి. కేసుల నుంచి బయటకు పడేందుకు ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. జగన్‌ రాజకీయ కుట్రలో భాగంగానే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×