E-Paper
Advertisement

Devineni Avinash: అరెస్ట్ తప్పించుకునేందుకు దేవినేని అవినాష్ ప్లాన్.. ఆ కేసులో?

Devineni Avinash: అరెస్ట్ తప్పించుకునేందుకు దేవినేని అవినాష్ ప్లాన్.. ఆ కేసులో?

Devineni Avinash: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది.

టీడీపీ ఆఫీసు దాడి కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ముఖ్యనేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి. ఇందులోభాగంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.

ALSO READ: ప్రకాశం బ్యారేజ్ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్.. కుట్రా? నిర్లక్ష్యమా?

అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయా నేతలు. విజయవాడ వరదల సమయంలోనూ కనిపించలేదు. దీంతో పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు. అరెస్ట్ నుంచి తప్పించుకు నేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుండగా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు వైసీపీ నేత దేవినేని అవినాష్. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరపున పిటిషన్లు దాఖలు చేశారు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. ఆయా పిటిషన్లు వచ్చేవారం విచారణకు రానుంది. అప్పటివరకు వారంతా పరారీలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

2021, అక్టోబరు 19న టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు కొంతమంది వ్యక్తులు. ఆఫీసులోకి చొరబడి ఫర్మీచర్‌ను ధ్వంసం చేశారు. రీసెంట్‌గా ఏపీలో అధికార మార్పిడి జరగడంతో ఆ కేసును వేగవంతం చేశారు పోలీసులు.

ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న దేవినేని అవినాశ్, జోగి రమేష్, రఘురాం, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డిలు హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. అప్పటి నుంచి ఆయా నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. విచారణ తర్వాత న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

20 రోజుల కిందట దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ తోసిపుచ్చితే.. ఆయా నేతలు అరెస్ట్ కావడం ఖాయమనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×