E-Paper
Advertisement

YS Sunitha: టీడీపీలోకి సునీత.. పోస్టర్ పాలి..ట్రిక్స్!

YS Sunitha: టీడీపీలోకి సునీత.. పోస్టర్ పాలి..ట్రిక్స్!
Advertisement
sunitha poster

YS Sunitha: ఈ పోస్టర్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త చర్చకు తెరలేపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు.. వైఎస్ సునీత రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రొద్దుటూరులో గుర్తు తెలియని వ్యక్తులు వేశారు ఈ పోస్టర్. YS సునీత రాజకీయ ప్రవేశానికి స్వాగతం అంటూ ఆ పోస్టర్‌ లో ఉంది. ఆ పోస్టర్లలో తెలుగుదేశంపార్టీ అని ఉంది. అలాగే YS సునీతతోపాటు.. ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, తండ్రి YS వివేక ఫొటోలు కూడా పోస్టర్లలో ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు డాక్టర్‌ సునీత పోరాటం చేస్తున్న సమయంలో ఈ పోస్టర్లు వేయడం చర్చగా మారింది.

వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సునీత టీడీపీలో చేరబోతున్నారని కామెంట్స్ చేశారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా సునీత టచ్‌లో ఉన్నారని కూడా సజ్జల ఆరోపించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్‌ అయింది. ఇప్పుడు ఏకంగా టీడీపీలో చేరబోతున్నారంటూ సునీత పేరిట పోస్టర్లు రావడంతో ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పైగా.. ఈ పోస్టర్‌లో చంద్రబాబు, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్టర్లు ఎవరు అతికించారనే విషయం తెలియట్లేదు కానీ.. ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

Advertisement

ఈ పోస్టర్లపై సునీత నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పోస్టర్లు అన్న ప్రచారం జరుగుతోంది. ఆ పోస్టర్లతో తమకేం సంబంధం లేదని టీడీపీ ప్రకటించింది. అంటే, ఇది వైసీపీ ఆడుతున్న మైండ్ గేమా? ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయబోతోందని ప్రచారం జరుగుతున్న సమయంలో.. సునీత టీడీపీలో చేరుతున్నారనేలా సీన్ క్రియేట్ చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే గేమ్ ప్లాన్ దాగుందా? సునీత, టీడీపీ వల్లే వివేకా హత్య కేసులో అవినాష్‌ను ఇరికించారనే మెసేజ్ ఇచ్చేందుకేనా ఈ పోస్టర్ పాలి..ట్రిక్స్?

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×