E-Paper
Advertisement

one acre 99 paise only: ఎకరా 99 పైసలు.. టీడీపీ ఏం అంటుందంటే?

one acre 99 paise only: ఎకరా 99 పైసలు.. టీడీపీ ఏం అంటుందంటే?
Advertisement

“రూపాయికి ఇడ్లీ వస్తుందే లేదో నాకు తెలియదు కానీ.. ఊరూ పేరూ లేని కంపెనీలకు 3వేల కోట్ల రూపాయలు డబ్బులు దోచిపెట్టి నాకింత, నీకింత అని పంచుకున్నారు.” ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇటీవల మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. దీనికి కౌంటర్ గా మరో వీడియో షేర్ చేసింది టీడీపీ సోషల్ మీడియా. జగన్ వెకిలి చేష్టలు, యువత ఉన్నతమైన ఆలోచనలు అంటూ కౌంటర్ వీడియో రిలీజ్ చేసింది. అందులో.. టీసీఎస్ కి 1 రూపాయికి ఎకరా ఎందుకిచ్చారో అర్థమయ్యేలా చెప్పించారు. ఆ ల్యాండ్ ఇచ్చారు కాబట్టే 1500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 12వేలమందికి ఉద్యోగాలు వస్తాయని, అది చిన్నవిషయం కాదని వివరించారు. అందుకే ఏపీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. అది జగన్ కి ఎప్పటికీ అర్థం కాదంటూ వీడియో విడుదల చేసి కౌంటర్ ఇచ్చింది టీడీపీ.

Advertisement

ఎకరా 99 పైసలు

విశాఖలో టీసీఎస్, ఉర్సా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ రేటుకి భూమిని లీజుకిచ్చిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఎకరా 99 పైసలకు లీజుకివ్వడం సరికాదని ప్రతిపక్ష వైసీపీ అంటోంది. వైసీపీ మద్దతుదారులు కొందరు రూపాయు చేతిలో పట్టుకుని కిరాణా షాపులకు వెళ్లడం, ఇతర షాపులకు వెళ్లి రూపాయికి తమకు తావాల్సిన వస్తువుల్ని అడుగుతున్నారు. అసలు రూపాయికి ఏం వస్తుందయ్యా అనే వారి ప్రశ్నకు.. చంద్రబాబు ఎకరా ఇచ్చేస్తున్నారు కదా అని బదులిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి టీడీపీ నుంచి కూడా గట్టిగానే సమాధానం వస్తోంది. వేల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడాన్ని ఇలా తప్పుబట్టడం సరికాదంటున్నారు టీడీపీ నేతలు.

Advertisement

ఉర్సాకు భూముల కేటాయింపు

ఇక టీసీఎస్ కి ఎకరా 99 పైసలకు లీజుకిచ్చామని, కానీ ఉర్సా సంస్థ మాత్రం ఎకరాకు రూ.50లక్షల చొప్పున 56.6 ఎకరాలు, కోటి రూపాయల చొప్పున 3.5 ఎకరాలు అమ్ముతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చింది. మరో వైపు సీపీఎం నేతలు కూడా విశాఖ భూముల కేటాయింపుపై మండిపడుతున్నారు. కూటమి ‍ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోందని సీపీఎం విమర్శించింది. ఉర్సా సంస్థకు కటాయించే భూములను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలు ఆ భూముల వద్ద ఆందోళన చేపట్టారు.

టీడీపీ కౌంటర్ ఎటాక్..

మొత్తమ్మీద ఎకరా 99 పైసలంటూ వైసీపీ కాస్త వెటకారంగా ఈ ప్రచారాన్ని మొదలు పెట్టగా, దాన్ని సక్సెస్ ఫుల్ గా తమకు అనుకూలంగా మార్చుకుంది టీడీపీ. ఎకరా 99 పైసలకు లీజుకిచ్చే భూముల్లో ఏం జరుగుతోంది, ఎంత అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని వివరిస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు ఉర్సా భూముల కేటాయింపుపై కూడా వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని అంటున్నారు. విశాఖను ఐటీ హబ్ గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టీసీఎస్ సంస్థ 1500 కోట్ల పెట్టుబడితో అక్కడ తమ కార్యకలాపాలు మొదలు పెడుతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 12వేలమందికి ఉపాధి లభించడంతోపాటు, పరోక్షంగా దాదాపు లక్షమందికి జీవనోపాధి లభించే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×