E-Paper
Advertisement

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..

TDP : టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఫైర్..
Advertisement

TDP : ఏపీలో ఓ మహిళా టీడీపీ నేత అరెస్ట్ పొలిటికల్ హీట్ ను పెచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో ఫిబ్రవరి 20న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై రెండు కేసులు నమాదయ్యాయి. ఈ కేసులో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణిని పోలీసులు నిందితురాలిగా పేర్కొన్నారు. అప్పట్నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా హనుమాన్‌ జంక్షన్‌లోని నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తెల్లవారుజామున కల్యాణి ఇంటికి వచ్చి అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు, కల్యాణి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇంత దుర్మార్గమా..?: చంద్రబాబు
మూల్పూరి సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. కల్యాణిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఓ మహిళను బెడ్‌రూంలోకి చొరబడి అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలు ప్రశ్నించిన మహిళపై హత్య కేసు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.

Advertisement

వ్యవస్థకే కళంకం: లోకేశ్
సాయి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. ఓ మహిళపై ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారని మండిపడ్డారు. వైసీపీ నేతల మెప్పు కోసం పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. కల్యాణికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×