BigTV English
Advertisement

Pawan Kalyan : ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. పొత్తులపై బాబు, పవన్ క్లారిటీ ఇదే..

Pawan Kalyan : ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం.. పొత్తులపై బాబు, పవన్ క్లారిటీ ఇదే..

Pawan Kalyan : చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు 2 గంటలపాటు ఇరువురు నేతలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను చంద్రబాబు, పవన్ వెల్లడించారు. తాను ఎక్కడికెళ్లినా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాజీవితం అంధకారం మారిపోయిందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ తన లక్ష్యమన్నారు.


చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
అన్ని పార్టీలు, సంఘాలు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ఎమర్జెన్సీ కంటే ఎక్కువగా ఏపీలో ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే కేంద్రం దృష్టికి తీసుకెళతాం. పోలీసులు అర్ధరాత్రి వచ్చి ప్రతిపక్ష నేతల ఇళ్ల గోడలు దూకుతున్నారు. నా నియోజకవర్గంలో నన్ను అడ్డుకుంటారా? ఇప్పటంలో పవన్ ను అడ్డుకున్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ నాసనం అయిపోయాయి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదా?. కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసులే కారణం. సినిమావాళ్ల కార్యక్రమాలు జరుపుకోవటానికి పరిష్మన్ ఇవ్వారా?. ఏపీలో పరిస్థితులపై కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి.

పొత్తులపై క్లారిటీ ఇదే..
పొత్తుల విషయంపై చంద్రబాబు స్పందించారు. రాజకీయాల్లో పొత్తులు సహజమన్నారు. పొత్తులపై మాట్లాడుకోవడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఎన్నికలు, పొత్తులపై తర్వాత చర్చిస్తామని తెలిపారు. 2009లో అప్పటి టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల్లో సమీకరణాలు మారుతుంటాయన్నారు. ఎన్నికలప్పుడు పొత్తులుంటాయని తేల్చిచెప్పారు.


పవన్ ఏం చెప్పారంటే..
కుప్పం ఘటనపై చంద్రబాబును కలిశాను. వైసీపీ అరాచకాలపై మాట్లాడుకున్నాం. రైతు సమస్యలు , పెన్షన్ల తొలగింపుపై చర్చించాం. ఏపీలో బ్రిటీష్ కాలం నాటి జీవో తెచ్చారు . సీఎం జగన్ ఓటమి భయంతోనే చెత్త జీవోలు తెస్తున్నారు. ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాస్తున్నారు. ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వడంలేదు. విశాఖలో నాపై ఆంక్షలు పెట్టారు. కుప్పంలో చంద్రబాబును తిరగ నివ్వకపోవడం సరికాదు. భద్రతా వైఫల్యం వల్లే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయి. వైసీపీ అరాచకాలపై బీజేపీతో చర్చిస్తాం. నేను అడుగు తీసి అడుగు వేస్తే వాళ్లు ఇబ్బందేంటి? రూల్స్ అందరికీ వర్తిస్తాయంటారు. కానీ అమలు చేయరు. పోలీసులు నిస్తేజంగా ఉండటం వల్లే ఏపీలో శాంతి భద్రతల సమస్యలు. నేను వారాహి వాహనం కొనుక్కుంటే వైసీపీ నేతలకు ఇబ్బందేంటి?

బీఆర్ఎస్ కు స్వాగతం
ఏపీలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నాం. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. పొత్తులపై ఇప్పుడే మట్లాడటం సరికాదు. మొత్తం మీద పవన్ -చంద్రబాబు భేటీ ఏపీలో రాజకీయాలను హీటెక్కించింది. కలిసి పోరాటం చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించడంతో ఇక పొత్తుల ప్రకటన లాంఛనమేనని తేలిపోయింది.

Related News

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Big Stories

×