E-Paper
Advertisement

Tirumala : వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు ఉచిత టోకెన్స్ పంపిణీ ఇలా..!

Tirumala : వైకుంఠ ద్వార దర్శనం.. భక్తులకు ఉచిత టోకెన్స్ పంపిణీ ఇలా..!

Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న అర్ధరాత్రి 1.45 నిమిషాల నుంచి జనవరి 1 రాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలను భక్తుల కోసం తెరవనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా, అదృష్టంగా భక్తులు భావిస్తారు.

గత నాలుగేళ్లుగా 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరిచి ఉంచుతున్నారు. శ్రీరంగంలో ఏ విధంగా అయితే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరుస్తారో.. అదే విధంగా ఇక్కడ కూడా పాటిస్తున్నారు. ప్రతిరోజు 75 వేల నుంచి 80 వేల మంది భక్తులకు దర్శనం కోసం వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఈనెల 22 నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా ఉచిత టోకన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజు చక్రతీర్థం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు. అలానే వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉచిత టోకెన్ కౌంటర్ల వద్ద క్యూలైన్లతో పాటు భక్తులకు అవసరమైన అన్న ప్రసాదాలు కూడా అందజేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×