E-Paper
Advertisement

Assembly Session : విద్యుత్ రంగంపై చర్చ.. లెక్కలు వెల్లడించిన భట్టి..

Assembly Session : విద్యుత్ రంగంపై చర్చ.. లెక్కలు వెల్లడించిన భట్టి..
Advertisement
TS Assembly session news

TS Assembly session news(Telangana news live) :

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర విద్యుత్‌ రంగం పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్‌ రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి విద్యుత్‌ సరఫరానే వెన్నెముక అని భట్టి పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో విద్యుత్‌ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వివరించారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని ప్రకటించారు. 2023 అక్టోబర్‌ 31 నాటికి రూ.81,516 కోట్లు అప్పులు తెచ్చారని వెల్లడించారు.

Advertisement

ప్రభుత్వం వెల్లడించిన లెక్కలపై గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్ రెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పులు తెచ్చి ఆస్తులు పెంచామని స్పష్టంచేశారు. వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఈ విషయం చెప్పిందన్నారు. గతంలో ట్రాన్స్ మిషన్ వ్యవస్థ సరిగా ఉండేది కాదన్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.

2014 ముందు తెలంగాణ ప్రజలు విద్యుత్ వాడనట్లు జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కరెంట్ ను బీఆర్ఎస్ నేతలే కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని సెటర్లు వేశారు.

Advertisement

.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×