E-Paper
Advertisement

TTD: తిరుమలలో భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..

TTD: తిరుమలలో భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..
Advertisement

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల కోసం దృష్టిలో ఉంచుకుని.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ కొత్త విధానం మే 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి రానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నూతన షెడ్యూల్ ప్రకారం, మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను మార్నింగ్ 6 గంటల నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సమయాన్ని ముందుకు జరపడంతో.. తర్వాతి స్లాట్లలో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కల్పించవచ్చని టీటీడీ భావిస్తోంది.

Advertisement

ఇదే కాకుండా.. వేసవి సెలవుల కాలంలో (మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు) వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో ఇంకొన్ని మార్పులు చేశారు. ఈ నిర్దిష్ట సమయంలో.. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలు స్వయంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రమే వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారికి ఈ కాలంలో బ్రేక్ దర్శన సౌకర్యం అందుబాటులో ఉండదని టీటీడీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే.. ఈ నిర్ణయాల ముఖ్య ఉద్దేశ్యమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ మార్పులను ముందుగా పరిశీలనాత్మకంగా అమలు చేసి, భక్తుల స్పందన, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్య భక్తుల దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను పలువురు స్వాగతిస్తున్నారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×