Nellore News: హిజ్రాలు రూటు మార్చారా? అడిగినంత ఇవ్వకుండా సామాన్యులపై దాడి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారా? ఉత్తరాది వాళ్ల దారిని ఎంచుకున్నారా? అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఆసుపత్రిలో నర్సుపై మూకుమ్మడిగా హిజ్రాలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ట్రాన్స్ జెండర్లు ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఇచ్చినంత డబ్బులు తీసుకునేవారు. వారు రూటు మార్చారు. తాము ఎంత అడిగితే అంత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇవ్వకుంటే సామాన్యులపై దాడులు చేస్తున్నారు కూడా. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఏపీలో వెలుగుచూసింది.
నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాలు దాడులకు తెగబడ్డారు. మద్యం మత్తులో ఆసుపత్రిలో పని చేస్తున్న నర్సుని మూమూలు డిమాండ్ చేశారు. తన దగ్గర డబ్బులు ఎందుకుంటాయని ఆమె ఎదురు ప్రశ్నించింది. వారిని ప్రశ్నించడమే ఆ నర్సు చేసిన తప్పు. తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆరుగురు హిజ్రాలు నర్సుని బయటకు లాకొచ్చి దాడి చేశారు.
కొన్ని ఫైల్స్ తీసుకుని కింద విసిరి పారేశారు. ఈలోగా పేషెంట్లు వచ్చి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ నర్సుని దాడి చేశారు. నర్సు జుట్టు పట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. ఆపై బట్టలు చించేసి దాడి చేశారు హిజ్రాలు. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో ఈతతంగమంతా రికార్డు అయ్యింది.
ALSO READ: జైలులో బత్తుల ప్రభాకర్ ఏమేమి చేసేవాడు
దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హిజ్రాలపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్యులు. నెల్లూరు జిల్లాలో రోజురోజుకూ వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయని మండిపడుతున్నారు.
ఒకప్పుడు హిజ్రాలు సామాన్యులు ఎంత ఇస్తే అంత తీసుకునేవారు. అయితే ఉత్తరాది నుంచి ఈ మధ్యకాలంలో దక్షిణాది రాష్ట్రాలకు చాలామంది హిజ్రాలు వలస వచ్చారు. వారంతా రాష్ట్రాలు, ప్రాంతాలుగా విడిపోయారు. పిల్లల బర్త్ డే ఫంక్షన్లు, షాపు ఓపెనింగులు, గృహ ప్రవేశం వంటి కార్యక్రమాలు జరిగితే క్షణాల్లో వాలిపోతుంటారు.
వారికి కావాల్సినంత డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఇంటి నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటారు. అంతేకాదు తెల్లవారుజామున వాహనంలో తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే పెళ్లి, గృహ ప్రవేశాలు తెలుసుకుని వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు కూడా.
అడిగినంత మామూళ్లు ఇవ్వలేదని ట్రాన్స్జెండర్ల వీరంగం
నెల్లూరు-కందుకూరులోని ఓ ఆస్పత్రిలో ట్రాన్స్జెండర్ల ఆగడాలు
మద్యం మత్తులో నర్సుపై ఆరుగురు హిజ్రాలు దాడి
నర్సు జుట్టు పట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి బట్టలు చించేసి దాడి చేసిన హిజ్రాలు pic.twitter.com/9G7f0XxzwB
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2025