BigTV English
Advertisement

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Durgamma Temple: మన దేశంలో హిందూ జనాభా ఎక్కువ. దాదాపు 80 శాతం మంది ప్రజలు హిందువులే ఉన్నారు. దేశంలో పురాతన టెంపుల్స్ ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటే.. కారణం హిందూ ప్రజలకు దైవ భక్తి ఎక్కువ. హిందువులు దేవాలయాలను పరిశుభ్రంగా చూసుకుంటారు. అందుకే ఇప్పటికీ వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుడులు, గోపురాలు దేవాలయాలు పవిత్ర స్థలాలు కాబట్టి స్నానం చేసి పద్ధతిగా తయారై వెళ్తుంటారు. ముఖ్యంగా చెప్పులను ధరించి గుడిలోకి వెళ్లడాన్ని హిందూ సాంప్రదాయంలో ఒప్పుకోరు. అలా వెళ్లడం పద్ధతి కూడా కాదు. ఇది అహంకారాన్ని తెలియజేస్తుంది. తాజాగా ఇంద్ర కీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


ఇంద్ర కీలాద్రి టెంపుల్ లో ఇవాళ అపచారం జరిగింది. కీలాద్రిపై దుర్గ అమ్మ వారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు ఘనంగా జరుగుతోన్న వేళ ముగ్గురు వ్యక్తులు కాళ్లకు చెప్పులు ధరించి టెంపుల్ లోకి ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు చెప్పులు ధరించి హల్చల్ చేశారు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ పాదరక్షలతో వచ్చారనేది ఇంకా తెలియరాలేదు. అక్కడ వందలాది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ దర్శనానికి ఎలా వచ్చారని.. పోలీసులు విచారిస్తున్నారు.

ALSO READ: Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు


ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దుర్గ అమ్మ వారి టెంపుల్ లోకి చెప్పులు ధరించి వెళ్లిన నాస్తికులపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పైరవుతున్నారు. వందలాది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ.. వారు దర్శనానికి ఎలా వచ్చారని పోలీసులు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురు నాస్తికులు ఇలా చేయడానికి గల కారణం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. తగిన బుద్ది చెప్పాలని.. మరో సారి ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: Treasure in Bihar: దేశం మొత్తానికి సరిపోయేంత బంగారం.. అసలెక్కడుంది ఈ నిధి? ఈ నిధి వెనకాల మిస్టరీ ఏంటి?

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×