E-Paper
Advertisement

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు
Advertisement

MLC Zakia Khanam: ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారంపై దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయం నుండి టీటీడీ అధికారులు, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారు. తాజాగా తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేయడమే. ఇంతకు ఫిర్యాదు చేసింది ఎవరిపైనో తెలుసా.. ఏపీకి చెందిన రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ పై.

తిరుమల దర్శనం టికెట్లకు సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు ఇలా సిఫార్సు లేఖలు ఇస్తుంటారు. అలాగే పలువురు భక్తులు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంకై కూడా సిఫార్సు లేఖను తీసుకుంటుంటారు. అయితే తాజాగా బెంగుళూరుకు చెందిన సాయి కుమార్ అనే భక్తుడు.. తన వద్ద సిఫార్సు లేఖ కోసం ఎమ్మెల్సీ జకియా ఖానమ్ రూ.65 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం పది టికెట్ల కోసం భక్తుడు సంప్రదించగా.. ఒక్కో టికెట్ రూ.10 వేలకు విక్రయించినట్లు సమాచారం.

Advertisement

ముందుగా రూ. 65 వేలు చెల్లించగా.. అసలు బ్రేక్ దర్శనం టికెట్ల విలువ తెలుసుకున్న భక్తుడు.. అసలు విషయాన్ని గ్రహించి సిఫార్సు లేఖ ఇచ్చిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్, ఆమె పీఏ, మరొకరిపై కూడా టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనితో షాక్ తిన్న టీటీడీ అధికారులు సైలెంట్ గా విచారణ నిర్వహించారట. ఆ విచారణలో నిర్ధారణ కావడంతో, తిరుమల వన్ టౌన్ లో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.

Also Read: TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

Advertisement

ఫిర్యాదుదారుల వద్ద పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జకియా ఖానమ్, పీఆర్ఓ కృష్ణ తేజలపై కేసు నమోదు చేశారు. ఏకంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్షాత్తు ఎమ్మెల్సీపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. దీనిని బట్టి టీటీడీ ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన టీటీడీ పూర్తి విషయాలు.. విచారణలో వెల్లడైన అనంతరం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అలాగే సిఫార్సు లేఖ ఎమ్మెల్సీ ప్రమేయంతోనే భక్తుల చెంతకు చేరిందా.. లేక మరేదైనా ఉందా అనే విషయాలు కూడా పోలీసుల విచారణ అనంతరం వెల్లడి కావాల్సి ఉంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×