BigTV English
Advertisement

Tractor Accident: బాపట్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Tractor Accident: బాపట్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Tractor Accident in Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలంలోని యాజలిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


దమన్నదారిలో దేవస్థానానికి ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు గట్టువారిపాలెం వాసులుగా గుర్తించారు. వీరంతా కొండపాటూరు పోలెరమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉదయం బయలుదేరారు.

దమన్నదారిలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 14 మంది ఉన్నట్లు గుర్తించారు. కొండపాటూరు పోలెరమ్మ తల్లి దేవస్థానం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ట్రాక్టర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

వాహనాలను నడుపుతున్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుందనే విషయం మర్చిపోవద్దని, డ్రైవర్లు కూడా మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపాలన్నారు. అతివేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×