E-Paper
Advertisement

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి

Maredumilli Tour: విషాదాన్ని నింపిన మారేడుమిల్లి టూర్.. జలపాతంలో గల్లంతై మెడికోలు మృతి
Advertisement

Tragedy in Maredumilli Tour: మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి.. ఇద్దరు మెడికోలు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఏలూరులోని ఆశ్రం కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది మెడికల్ స్టూడెంట్స్ ఒక ట్రావెలర్ వెహికల్ లో ఆదివారం మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లారు. మారేడుమిల్లి ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం. వేసవి విడిదికి, శీతాకాలపు అందాలకు పెట్టింది పేరు మారేడుమిల్లి.

ప్రకృతి అందాలను స్నేహితులతో కలిసి చూసేందుకు వెళ్లినవారు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు వెళ్లే అంతర్రాష్ట్ర దారిలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ కు చేరుకున్నారు. అప్పుడే భారీ వర్షం కురవడంతో.. జలపాతం ఉద్ధృతి పెరిగింది. వెళ్లిన స్టూడెంట్స్ లో ఐదుగురు సౌమ్య, హరదీప్, హరిణిప్రియ, అమృత, గాయత్రి పుష్ప గల్లంతయ్యారు. వారిలో హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన యువకులు కాపాడారు. విజయనగరానికి చెందిన ఇద్దరినీ రంపచోడవరం ఆస్పత్రికి తరలించగా.. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉందని రాజమండ్రికి తరలించారు.

Advertisement

Also Read: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గాలించగా.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని సౌమ్య(21), అమృత(21)లుగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. డాక్టర్లు అయ్యి ఉన్నతస్థానాలకు వెళ్తారనుకున్న పిల్లలు.. ఇలా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరదీప్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×