E-Paper
Advertisement

TTD: చేతికి కర్రలు, గాల్లో డ్రోన్లు, పిల్లలపై ఆంక్షలు.. టీటీడీ నిర్ణయాలు

TTD: చేతికి కర్రలు, గాల్లో డ్రోన్లు, పిల్లలపై ఆంక్షలు.. టీటీడీ నిర్ణయాలు
Advertisement
ttd

TTD: చిన్నారిని చిరుత చంపేసింది. గతంలోనూ పిల్లాడిపై దాడి చేసింది. మొదటి దాడికే గుణపాఠం నేర్చిఉంటే ఇప్పుడీ మరణం జరిగుండకపోయేది. పాప ప్రాణం పోయాక.. టీటీడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. పలు నిర్ణయాలు తీసుకుంది.

ఈసారి కూడా రక్షణ భారం భక్తుల మీదే పెట్టారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. కాలినడక దారిలో జంతువులకు ఎలాంటి ఆహరం పెట్టొద్దని.. పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెట్ల మార్గంలో చెత్త వేసే షాపుల యాజమాన్యాలపై యాక్షన్ ఉంటుందన్నారు. కాలినడకన వెళ్లే ప్రతీ భక్తుడికి ఒక చేతికర్ర ఇస్తామని.. కర్రే ఇకపై భక్తులకు ప్రధాన ఆయుధమంటోంది టీటీడీ. అయితే, టీటీడీ తీరుపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అంటే, ఇక మీదట చిరుత ఎదురైతే.. కర్రతో భక్తులే పోరాడాలా? అంటూ మండిపడుతున్నారు కొందరు.

Advertisement

ఘాట్‌రోడ్‌లో పలు ఆంక్షలు విధించింది టీటీడీ. టూవీలర్స్‌కు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇస్తామంది. కాలిబాటలో రాత్రి 10 గంటల వరకు పెద్దవాళ్లకు అనుమతి ఉంటుందని.. పిల్లలను మాత్రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే.. పేరెంట్స్‌తో అనుమతిస్తామని స్పష్టం చేసింది. భక్తులను గుంపులుగా మాత్రమే పంపుతామని ప్రకటించింది టీటీడీ.

నడకదారిలో ఇరువైపులా ఫోకస్ లైట్లు.. భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డులు.. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు.. భక్తుల సెక్యూరిటీ కోసం నైపుణ్యం ఉన్న ఫారెస్ట్‌ సిబ్బందిని నియమిస్తామని చెప్పారు టీటీడీ ఛైర్మన్ భూమన.

Advertisement

తిరుపతి నుంచి తిరుమల మధ్య 500 కెమెరాలు ఏర్పాటు చేస్తామని.. అవసరమైన చోట్ల డ్రోన్‌ కెమెరాలు కూడా వాడతామని చెప్పారు. కేంద్ర అటవీశాఖ అధ్యయనం తర్వాత దారికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకుంటామని.. అయితే, చెట్లను సైతం ఎక్కగల చిరుతను.. ఫెన్సింగ్‌తో అడ్డుకోలేమని అన్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×