E-Paper
Advertisement

TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

TTD Files Complaint: సీఎంకే ప్రాణగండం అంటూ పోస్ట్.. టీటీడీ ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహించింది. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. పుష్కరిణిలో శాస్త్రోక్తంగా శ్రీవారి చక్రస్నానంను నిర్వహించగా.. వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరిస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాల సంధర్భంగా సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంధర్భంగానే సీఎం చంద్రబాబు దంపతులు.. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆపై బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది..
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరైన సమయంలో చాలా మంది వీడియోలు తీయడం సర్వ సాధారణం. అయితే బాబు పర్యటన అనంతరం Blind Mannn అనే పేరు గల ఎక్స్ పేజీలో సీఎం పట్టువస్త్రాలు తలపై పెట్టుకొని ఉన్న షార్ట్ వీడియో‌ ని ఎక్స్ లో అప్లోడ్ చేసి ….దేవుడికి ఇష్టంలేదని స్పష్టంగా కనిపిస్తుంది, మళ్లీ చెప్తున్నా ప్రాణగండం ఉంది క్యాప్షన్ తో ఎక్స్ లో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారి.. టీటీడీ దృష్టికి వెళ్లింది. దీనితో ఒక పవిత్ర కార్యక్రమం గురించి తప్పుడు పోస్ట్ పెట్టడంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీ ప్రతిష్ఠ భంగం కలిగించేలా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా.. ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఎక్స్ లో పోస్ట్ పెట్టిన Blind Mannn అకౌంట్ నిర్వహకుడు చైతన్య పై పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ వింగ్ ఏవిఎస్వో.

Advertisement

ఏవిఎస్వో ఫిర్యాదుతో చైతన్య, మరికొందరిపై వన్ టౌన్ పోలీసులు 196,298,299,353(2) r/w BNS సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటీవల తరచూ సోషల్ మీడియా వేదికగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వస్తున్న పోస్టింగ్స్ పై టీటీడీ దృష్టి సారించింది. ఎవరైనా అసత్యపు ప్రచారాలు చేస్తే తప్పక చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలా రావు తెలిపారు.

Advertisement

Also Read: Beauty tips: ముఖానికి పసుపు ఇలా వాడారంటే రంగు పెరగడమే కాదు, చర్మ సమస్యలు రావు

అలాగే తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలలోని పలు షాపులపై సైతం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో శీతల పానీయాలను ఎంఆర్‌పీ కంటే అదనంగా విక్రయిస్తున్న దుకాణదారుల నుండి రూ.లక్ష జరిమానా వసూలు చేసి, కొన్ని దుకాణాలను సీజ్ కూడా చేశారు. తాము అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ టీటీడీపై అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని టీటీడీ ప్రకటించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×