E-Paper
Advertisement

TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?

TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?
Advertisement

TTD :

TTD : టీటీడీ ప్రపంచంలో అత్యంత ధనవంతమైన హిందూ క్షేత్రం. వేల కోట్ల ఆస్తులు టీటీడీకి ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఎన్నో భారత్ కార్పొరేట్ సంస్థల ఆస్తుల విలువ కంటే టీటీడీ సంపదే ఎక్కువ. టన్నల కొద్దీ బంగారం ఆ కలియుగ దైవానికి ఉంది. ఈ మధ్యే ఆ లెక్కలను టీటీడీ శ్వేతపత్రం రూపంలో వెల్లడించింది. అయితే ఆస్తుల విషయంలో అనేక వివాదాలు టీటీడీని చుట్టుముడుతున్నాయి. గతంలో స్వామివారి ఆభరణాలపై వివాదం నడిచింది. మళ్లీ ఇప్పుడు మరో వివాదం తిరుమలపై రేగింది.

Advertisement

తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. ఆ పీఠాధిపతులు శ్రీవారి దర్శనం కోసం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి అనుమతించమని కోరారు. పీఠాధిపతులను అనుమతించమని తమకు ఎలాంటి సమాచారం అంద లేదని భద్రతా సిబ్బంది తెలిపారు. ముందుగా లేఖ ఇచ్చినా అనుమతించారా అని ప్రశ్నిస్తూ పీఠాధిపతులు కాసేపు నిరసన చేపట్టారు.

విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి టీటీడీ వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని ఆరోపించారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవన్నారు. అందుకే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని ప్రకటించారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తామని వెల్లడించారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెడతామని తెలిపారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి స్పష్టం చేశారు.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×