E-Paper
Advertisement

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, అసలు కారణం అదే
Advertisement

Tirumala News: తిరుమలల్లో రోజు రోజుకూ రద్దీ పెరుగుతోంది. కనీసం ప్రతీ రోజు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. సాధారణ రోజుల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక వీకెండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఇక్కోసారి రికార్డు స్థాయిలో భక్తులు తిరుమలకు పొటెత్తుతున్నారు. తాజాగా రెండు రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక

Advertisement

ఏడాదికి ఒక్కసారైనా తిరుమల వెళ్లాలని భక్తులు కోరుకుంటున్నారు. మరికొందరైతే జీవితంలో ఒక్కసారి శ్రీనివాసుడ్ని చూడాలని కలలుకంటారు. కానీ కొందరి మాత్రమే సాధ్యపడుతుంది. గతంలోకంటే తిరుమల కొండలపై భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. స్వామి దర్శనానికి వెళ్లినవారు కొందరైతే.. దర్శనం తర్వాత వచ్చేవారు మరికొందరు.

ప్రతి రోజు భక్తులతో తిరుమల గిరులు సందడిగా మారుతోంది. దర్శనాలకు టికెట్లు దొరక్క చాలామంది అక్కడే ఉంటున్నారు. మరికొందరు వీఐపీ లెటర్ పేరుతో దర్శనాలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు ముఖ్య గమనిక. రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.

Advertisement

ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జులై 17న కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలు స్వీకరించమని తేల్చిచెప్పింది. దయచేసి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపింది టీటీడీ.

ఈ క్రమంలో జులై 13, జులై 16న వీఐపీ బ్రేక్‌ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపింది. ఇక జులై 17 ఆణివార ఆస్థానం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది.

ALSO READ: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఏపీ టు పుదుచ్చేరికి వెళ్లే పలు రైళ్లు రద్దు 

ఇదిలాఉండగా శనివారం తిరుమల శ్రీవారిని 90,546 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నవారు 36,303 మంది భక్తులు ఉన్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.భక్తులకు 4.61 లక్షల లడ్డూలను విక్రయించింది.

2.54 లక్షల మందికి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసింది. అలాగే భక్తులు వైద్య సహాయం కింద 3,162 మంది అందించినట్లు తెలియజేసింది. గదుల కోసం భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతోందని వెల్లడించింది టీటీడీ.

Related News

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

Big Stories

Advertisement
×