E-Paper
Advertisement

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!
Advertisement

APPSC Group 1: ఏపీ శాసనసభలో 344 నిబంధన కింద ప్రత్యేక చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడింది. రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్-1 అందిస్తుంది. ఎంతో శ్రమించి అభ్యర్ధులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు.

గత పాలనలో..

గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రూప్ – 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని అన్నారు. బరితెగించి అక్రమాలకు పాల్పడిన వ్యవహారం గత పాలనలో చేశారని, ప్రజలు, ఉద్యోగార్ధులు కూడా ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. అసెంబ్లీ జవాబు దారీ తనానికి వేదిక, దీని నుంచే ప్రజలకు వివరాలు చెప్పాలన్నారు. ఈ తరహా అక్రమాలు మళ్లీ పునరావృతంగా కాకుండా సంస్థలో కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

పదో తరగతి పరీక్షలు..

Advertisement

2019-24 మధ్య విధ్వంసం జరిగిందని చాలాసార్లు చెప్పాను. ప్రజావేదికతో మొదలు పెట్టి రాష్ట్ర బ్రాండ్ వరకూ దెబ్బతీశారన్నారు. ఏపీ ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారు. 2018లో జారీ చేసిన గ్రూప్ – 1 సర్వీసుల నోటిఫికేషన్ విడుదల చేస్తే 1.14 లక్షల మంది దరఖాస్తు చేశారని అన్నారు. ఇందులో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారని అన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగితే జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్టుతో తరలిస్తాంమన్నారు.

Also Read: మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

కోర్టు ఉత్తర్వుల తర్వాత..

Advertisement

అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారుల నియామకాలకు సంబంధించి పరీక్షలు జరిగితే ఇంకెంత భద్రంగా ఉండాలి? కానీ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరించారు. అవకతవకలకు పాల్పడ్డారు. డిజిటల్ ఇవాల్యుయేషన్ పక్కన పెట్టి మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు చెప్పిందన్నారు. అయినా కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అఫిడవిట్లు వేసి బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తించారన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత సరిదిద్దుకోవాల్సింది పోయి హాయ్ లాండ్‌లో ఎవాల్యుయేషన్ కోసం రూ.1.19 కోట్లకు పనులకు ఉత్తర్వులు ఇచ్చారు.

గ్రూప్ 1 అధికారులు..

ఓవైపు కోర్టు ఆదేశాలు ఉన్నా ఇంటర్వూలు నిర్వహించి ఉద్యోగాల నియామకాలను కూడా చేసేశారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ప్రైవేటు చేతికి ఎవాల్యుయేషన్ అప్పగించి బరితెగించారన్నారు. ఇతర కేసులో సీఐడీ స్వాధీనంలో ఉన్న హాయ్ లాండ్ లో ఈ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. ప్రైవేటు వ్యక్తులను ఎవాల్యుయేటర్లను నియమించారన్నారు. గ్రూప్ 1 అధికారుల రాసిన పరీక్షలను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో ఎవాల్యుయేషన్ చేయించారన్నారు.

Also Read: బిగ్ బాస్ తర్వాత గంగవ్వ లైఫ్ మొత్తం మారిపోయిందా? అంజి మామ షాకింగ్ కామెంట్స్

Tags

Related News

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×