Duvvada Srinivas: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా శాసన మండలిలో విపక్ష వైసీపీ – టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడిపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దమ్ముంటే వ్యవసాయ మంత్రి చర్చకు రావాలని.. ‘ఆ ఆంబోతుని రమ్మనండి’ అంటూ అచ్చెన్నాయుడ్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అయితే మండలిలో ఓ వైపు క్షమించాలి అంటూనే అంబోతు అనే పదాన్ని దువ్వాడ శ్రీనివాస్ ప్రయోగించారు. ఆ పేరును సదరు మంత్రికి గతంలో తామెపెట్టామంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి సార్దకత కూడా సదరు వ్యక్తి తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ అన్నారు. చివరికి మంత్రి సొంత నియోజకవర్గమైన టెక్కలిలో కూడా యూరియా సమస్య దారుణంగా ఉందన్నారు. ఓ మహిళ యూరియా కోసం వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు విడిచిందని తెలియజేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.
దమ్ముంటే ఆ ఆంబోతుని (అచ్చెన్నాయుడు) చర్చకు రమ్మనండి
సార్థక నామధేయుడే.. అయినా సభలో ఆ పదం వాడినందుకు క్షమించండి అధ్యక్షా..
శ్రీకాకుళంలో యూరియా లేక అవస్థలు పడుతున్నారు.. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించాడు
– ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్#EndOfTDP pic.twitter.com/bo16CBCeYn
— Voice Of Y. Palem✊ (@Jagan3535) August 19, 2026
Also Read: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!
గత వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అప్పటి సీఎం జగన్ ప్రతీ ఎకరానికి ఇన్సూరెన్స్ కట్టి.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనావేసి అందుబాటులో ఉంచేవారని గుర్తుచేశారు. పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర కూడా కల్పించి.. రైతులను సంతోషపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందని పునరుద్ఘటించారు. వాటన్నింటిపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడాలని అన్నారు. అటు ఆరోగ్య శ్రీని సైతం భ్రష్టుపట్టించారని దువ్వాడ పేర్కొన్నారు.
Also Read: ల్యాప్టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?