E-Paper
Advertisement

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు

వైఎస్ జగన్ బిగ్ అనౌన్స్‌మెంట్.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని పిలుపు
Advertisement

YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర  వ్యతిరేకత ఉందని జగన్‌ అన్నారు. ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారని, అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ పెరుగుతోందన్నారు.

డాక్టర్‌ ప్రియాంక హత్య కేసులో..

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయని, ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగుతున్నాయని జగన్‌ ఫైర్ అయ్యారు. గంజాయి రవాణాలో పోలీసులు పట్టుబడటం దారుణమని వ్యాఖ్యానించారు. డాక్టర్‌ ప్రియాంక హత్య కేసులో పోలీసులు, అధికార పార్టీ కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని చంద్రబాబుపై జగన్‌ ఫైర్ అయ్యారు.

Advertisement

Also Read: బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

గత వైసీపీ ఐదేళ్ల పాలనతో..

విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎవరూ సంతోషంగా లేరని జగన్‌ అన్నారు. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, గత వైసీపీ ఐదేళ్ల పాలనతో ప్రస్తుత పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారని వెల్లడించారు. మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్‌ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏడాదే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేయాలని పార్టీ నేతలకు జగన్‌ పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్‌ నేతల సమావేశంలో జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also Read: నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

Tags

Related News

చిత్తూరు జిల్లాలో ఘోరం.. ఇన్నోవా కారు డ్రైవర్‌పైకి కంటైనర్ ఎక్కించి దారుణ హత్య!

దేవుడా.. వీళ్లా మాకు నాయకులు? కూటమి వైఖరిపై సభలోనే బొత్స ఆవేదన!

గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!

Big Stories

Advertisement
×