E-Paper
Advertisement

Tirumala News: మహిళా భక్తులకు టీటీడీ శుభవార్త.. వారిపై కేసు నమోదు చేస్తాం

Tirumala News: మహిళా భక్తులకు టీటీడీ శుభవార్త.. వారిపై కేసు నమోదు చేస్తాం
Advertisement

Tirumala News:  రీల్స్.. షార్ట్స్ చేసే పిచ్చోళ్లపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది టీటీడీ. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చిరించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేసింది.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కొందరు సోషల్‌మీడియా ఔత్సాహికులు తిరుమల శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో వెకిలి చేష్టలు చేస్తున్నారు. అంతేకాదు నృత్యాలు చేస్తూ వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారని తేలింది. వాటికి సంబంధించి వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

ఈ విషయం టీటీడీ దృష్టి సారించింది. పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అభ్యంతరకర చర్యలు అనుచితమని తెలిపింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తు న్నాయని పేర్కొంది.

తిరుమల క్షేత్రం.. భక్తి, ఆరాధనలకు నిలయమని, ఈ విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని చెప్పకనే చెప్పిది. అలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

ALSO READ: ఏపీలో వారికి కొత్త కబురు.. కొత్తగా నెలకు 4 వేలు పింఛన్‌

మహిళా భక్తులకు శుభవార్త

శ్రీవారి మహిళా భక్తుల కోసం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. ఆగష్టు 8న టీటీడీ ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం రోజు సౌభాగ్యం పేరుతో ఈ కార్యక్రమం చేపడుతోంది. టీటీడీ-హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం రోజు సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేయనుంది.

ఏపీ-తెలంగాణల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో పాల్గొన్న మహిళలకు సౌభాగ్యవతులకు వాటిని పంపిణీ చేయనున్నారు. దీనికితోడు శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తకాన్ని అందించనున్నారు. దీనికి సంబంధించి టీటీడీ సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.

సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ భక్తుడు విరాళంగా ఇచ్చాడు. వాటిలో 8 లక్షల గాజులు, లక్షా 40 వేల కంకణాలు- పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అష్టోత్తర శత నామావళి పుస్తకాలను సదరు ఆలయాలకు తరలించారు.

తిరుమలలో రద్దీ కంటిన్యూ

మరోవైపు తిరుమలలో రద్దీ కంటిన్యూ అవుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం తిరుమల శ్రీవారిని 66 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల మందికి పైగానే తలనీలాలు సమర్పించారు. గురువారం ఒక్కరోజు హుండి ఆదాయం రూ. 4.66 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×