E-Paper
Advertisement

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..

Tirumala: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..
Advertisement

Tirumala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనాలు నేటి అర్ధరాత్రితో ముగియనున్నాయి. గత ఏడాది డిసెంబర్ 31న ప్రారంభమైన ఈ ద్వార దర్శన వేడుకలు, నేటి (జనవరి 8) అర్ధరాత్రి వైకుంఠ ద్వారం మూసివేతతో ముగియనున్నాయి. ముగింపు రోజు కావడంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

ఈ పది రోజుల కాలంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టీటీడీ వినూత్న పద్ధతులను అవలంబించింది. మొదటి మూడు రోజులు ‘ఈ-డిప్’ (E-Dip) ద్వారా లక్కీ డిప్‌లో టోకెన్లు పొందిన వారికి అవకాశం కల్పించగా, మిగిలిన ఏడు రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం ద్వారా అనుమతించారు. నిన్న ఒక్కరోజే 85 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, నేడు కూడా అదే స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Advertisement

అలాగే భక్తుల సౌకర్యార్థం టీటీడీ యంత్రాంగం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది. ఏఐ (AI) ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు రద్దీని పర్యవేక్షిస్తూ, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు పంపిణీ చేశారు. భక్తుల భద్రత, క్రమశిక్షణ విషయంలో రాజీ పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం గమనార్హం.

Also Read: టీడీపీ నేత ప్రభాకర్ కిడ్నాప్.. వైసీపీ నేతల హస్తం ఉందన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు!

Advertisement

ప్రస్తుతం తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండటంతో, స్వామివారి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. నేటి అర్ధరాత్రి లోపు క్యూలైన్లలో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ పది రోజుల వైకుంఠ ద్వార యాత్ర భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×