Vijayawada Politics: త్వరలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రంగా కూతురు ఆశా కిరణ్ ఓ ప్రకటన చేశారు. ఇంతకీ ఆమె ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? టీడీపీ లేదా వైసీపీ లేకుంటే జనసేన, బీజేపీలోకి వస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లోకి రంగా కూతురు ఆశా
విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నవంబర్ 16న ఉదయం విజయవాడలోని బందర్ రోడ్డులోగల వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది ఆయన కూతురు ఆశా కిరణ్. ఉన్నట్లుండి ఆశాకిరణ్ పబ్లిక్ లైఫ్లోకి రావడంతో రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.
ప్రస్తుతం పాలకొల్లులో వన భోజనాలకు వెళ్తున్నట్లు వెల్లడించింది. రాజకీయాల ఎంట్రీపై తాను ప్రకటన చేయడం లేదని, దాని కోసం మరోసారి మాట్లాడుతాని చెప్పే ప్రయత్నం చేసింది. రాధ-రంగా మిత్ర మండలిలో గ్యాప్ ఉందని, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం బయటికి వచ్చానని మనసులోని మాట బయటపెట్టింది.
వేడెక్కిన బెజవాడ రాజకీయాలు
ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మా ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని తేల్చేసింది. రంగా ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని తెలియజేసింది. ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతల కారణంగా బయటకు రాలేదని పేర్కొంది. ఇకపై పబ్లిక్ లైఫ్లో ఉంటానని, రంగా అభిమానులను కలుస్తానని వెల్లడించింది.
ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేసింది. రంగా అన్ని కులాలకి చెందినవారని, తాను కూడా అంతేనని చెప్పుకొచ్చింది వంగవీటి ఆశా కిరణ్. ప్రస్తుతం వంగవీటి రాధా దుబాయ్ పర్యటనలో ఉన్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు.
ALSO READ: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లంటే..
పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉండడమే ధ్యేయమన్నారు ఆశా కిరణ్. పబ్లిక్ లైఫ్లోకి ఇవాళ నుంచి ఎంట్రీ ఇచ్చానని, ఆరంభం మాత్రమేనని తెలిపింది. ఏమైనా పార్టీలు మిమ్మల్ని సంప్రదించాయా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ఇది రాజకీయ ఎజెండా కాదని, దయచేసి పాయింట్ని డైవర్ట్ చేయవద్దని కోరింది.
జనసేన తప్పితే మిగతా ప్రధాన పార్టీలు ఆమెని సంప్రదించినట్టు విజయవాడలో ఓ వార్త గుప్పుమంది. దీనిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ప్రకటన చేసిన తర్వాత ఏ పార్టీ అన్నది చెబుతానని తప్పించుకునే ప్రయత్నం చేశారట ఆశాకిరణ్. మొత్తానికి రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడింది ఆశా కిరణ్.
వంగవీటి రంగా వారసురాలు పొలిటికల్ ఎంట్రీ..!
రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసిన రంగా కుమార్తె ఆశా కిరణ్
త్వరలో తన పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తానని తెలిపిన ఆశా కిరణ్ pic.twitter.com/1iVYeO1Jvp
— BIG TV Breaking News (@bigtvtelugu) November 16, 2025