E-Paper
Advertisement

Vijayawada Politics: రాజకీయాల్లోకి వస్తే వంగవీటి మార్క్ చూపిస్తా.. రంగా కూతురు సంచలనం

Vijayawada Politics: రాజకీయాల్లోకి వస్తే వంగవీటి మార్క్ చూపిస్తా.. రంగా కూతురు సంచలనం
Advertisement

Vijayawada Politics: త్వరలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. వంగవీటి రంగా ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు రంగా కూతురు ఆశా కిరణ్ ఓ ప్రకటన చేశారు. ఇంతకీ ఆమె ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? టీడీపీ లేదా వైసీపీ లేకుంటే జనసేన, బీజేపీలోకి వస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

రాజకీయాల్లోకి రంగా కూతురు ఆశా

Advertisement

విజయవాడలో వంగవీటి రంగా ఫ్యామిలీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నవంబర్ 16న ఉదయం విజయవాడలోని బందర్ రోడ్డులోగల వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది ఆయన కూతురు ఆశా కిరణ్. ఉన్నట్లుండి ఆశాకిరణ్ పబ్లిక్ లైఫ్‌లోకి రావడంతో రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.

ప్రస్తుతం పాలకొల్లులో వన భోజనాలకు వెళ్తున్నట్లు వెల్లడించింది.   రాజకీయాల ఎంట్రీపై తాను ప్రకటన చేయడం లేదని,  దాని కోసం మరోసారి మాట్లాడుతాని చెప్పే ప్రయత్నం చేసింది.  రాధ-రంగా మిత్ర మండలిలో గ్యాప్ ఉందని, అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం కోసం బయటికి వచ్చానని మనసులోని మాట బయటపెట్టింది.

Advertisement

వేడెక్కిన బెజవాడ రాజకీయాలు

ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. మా ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని తేల్చేసింది.  రంగా ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని తెలియజేసింది.  ఇన్నాళ్లు కుటుంబ బాధ్యతల కారణంగా బయటకు రాలేదని పేర్కొంది. ఇకపై పబ్లిక్ లైఫ్‌లో ఉంటానని, రంగా అభిమానులను కలుస్తానని వెల్లడించింది.

ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం చేసింది. రంగా అన్ని కులాలకి చెందినవారని, తాను కూడా అంతేనని చెప్పుకొచ్చింది వంగవీటి ఆశా కిరణ్. ప్రస్తుతం వంగవీటి రాధా దుబాయ్ పర్యటనలో ఉన్నట్లు  ఆయన అభిమానులు చెబుతున్నారు.

ALSO READ: ఏపీకి భారీగా పెట్టుబడులు.. ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్లంటే.. 

పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉండడమే ధ్యేయమన్నారు ఆశా కిరణ్. పబ్లిక్ లైఫ్‌లోకి ఇవాళ నుంచి ఎంట్రీ ఇచ్చానని, ఆరంభం మాత్రమేనని తెలిపింది.  ఏమైనా పార్టీలు మిమ్మల్ని సంప్రదించాయా? అన్న ప్రశ్నకు ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు.  ఇది రాజకీయ ఎజెండా కాదని, దయచేసి పాయింట్‌ని డైవర్ట్ చేయవద్దని కోరింది.

జనసేన తప్పితే మిగతా ప్రధాన పార్టీలు ఆమెని సంప్రదించినట్టు విజయవాడలో ఓ వార్త గుప్పుమంది. దీనిపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని,  ప్రకటన చేసిన తర్వాత ఏ పార్టీ అన్నది చెబుతానని తప్పించుకునే ప్రయత్నం చేశారట ఆశాకిరణ్. మొత్తానికి రాజకీయ నాయకుల మాదిరిగా మాట్లాడింది ఆశా కిరణ్.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×