E-Paper
Advertisement

Varra Ravindra Reddy: ష‌ర్మిల‌, సునీత‌, విజ‌య‌మ్మ‌పై అనుచిత పోస్టులు పెట్టాం.. రిమాండ్ రిపోర్ట్ లో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి!

Varra Ravindra Reddy: ష‌ర్మిల‌, సునీత‌, విజ‌య‌మ్మ‌పై అనుచిత పోస్టులు పెట్టాం.. రిమాండ్ రిపోర్ట్ లో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి!
Advertisement

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్ట్ వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి పోలీసుల అదుపులో ఉన్న సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశార‌ని వ‌ర్రా రవీంద్ర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మంగ‌ళ‌వారం అత‌డిని అద‌న‌పు మెజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచారు. విచార‌ణ అనంత‌రం 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేప‌థ్యంలో రిమాండ్ రిపోర్ట్‌లో వర్రా రవీంద్ర‌రెడ్డి సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌టపెట్టారు. ఐప్యాక్ టీమ్‌ కంటెంట్ ఇస్తే ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసేవాళ్ళమ‌ని చెప్పారు.

Also read: ప్రశ్నిస్తే ఖేల్ ఖతమా? మీకు భయపడాలా? మీరు మాత్రం పవిత్రులా? పోసాని సీరియస్

Advertisement

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టేవాళ్ళమ‌ని అన్నారు. వైసీపీ సోష‌ల్‌మీడియా బాధ్య‌త‌లు సజ్జల భార్గవరెడ్డి తీసుకున్న త‌ర‌వాత‌ మరింత రెచ్చిపోయామ‌ని చెప్పారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించాడని అన్నారు. 2023 నుండి త‌న ఫేస్‌బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టాడని తెలిపాడు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామ‌ని ఒప్పుకున్నారు. ఆ పోస్టులు పెట్టాలని అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి త‌మకు కంటెంట్ ఇచ్చారని అన్నారు.

వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకంగా ఉన్నార‌ని వెల్ల‌డించారు. దీంతో వైసీపీ సోషల్ మీడియానే మాజీ సీఎం, పార్టీ అధినేత జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల‌పై పోస్టులు పెట్ట‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, అస‌భ్య కామెంట్లు చేసిన వారిపై టీడీపీ స‌ర్కార్ క‌న్నేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే గ‌త ప్ర‌భుత్వంలో, ప్ర‌భుత్వం మారిన త‌ర‌వాత సోష‌ల్ మీడియాలో మ‌హిళ‌ల‌పై అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన వారిని క‌ట‌క‌టాల్లోకి నెట్టేస్తున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×