E-Paper
Advertisement

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..

Tirumala : తిరుమలలో మరోసారి విజిలెన్స్ భద్రతా వైఫల్యం బయటపడింది. అలిపిరి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. తిరుమల- తిరుపతి మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్‌ కెమెరాతో శేషాచల కొండలను చిత్రీకరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీటీడీ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు.

సాధారణంగా భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఎగురవేయడానికి అనుమతించరు. భక్తులు వాహనాల్లో తిరుమలకు చేరుకునే సమయంలో అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి కొండపైకి పంపిస్తారు. కానీ ఘాట్‌రోడ్డుపై డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా భద్రతా వైఫల్యమని భక్తులు టీటీడీ అధికారులపై మండిపడుతున్నారు.

.

.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×