E-Paper
Advertisement

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..

Tirumala : డ్రోన్‌తో వీడియో షూట్.. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..
Advertisement

Tirumala : తిరుమలలో మరోసారి విజిలెన్స్ భద్రతా వైఫల్యం బయటపడింది. అలిపిరి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు వ్యక్తులు డ్రోన్ ఎగురవేశారు. తిరుమల- తిరుపతి మొదటి ఘాట్‌రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద ఇద్దరు వ్యక్తులు డ్రోన్‌ కెమెరాతో శేషాచల కొండలను చిత్రీకరించారు. అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టీటీడీ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని అస్సాంకు చెందిన వారిగా గుర్తించారు అధికారులు.

సాధారణంగా భద్రతా కారణాల దృష్ట్యా తిరుమలలో ఎటువంటి డ్రోన్లు ఎగురవేయడానికి అనుమతించరు. భక్తులు వాహనాల్లో తిరుమలకు చేరుకునే సమయంలో అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించి కొండపైకి పంపిస్తారు. కానీ ఘాట్‌రోడ్డుపై డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా భద్రతా వైఫల్యమని భక్తులు టీటీడీ అధికారులపై మండిపడుతున్నారు.

Advertisement

.

.

Advertisement

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×