E-Paper
Advertisement

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..
Advertisement

Atal Setu : ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.

రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతును నిర్మించారు. ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ఇప్పటివరకు రెండు గంటల సమయం పడుతోంది. అటల్ సేతు ద్వారా ఆ దూరాన్ని 15- 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు . అందులో 16 కిలోమీటర్లలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకొనేలా ఈ వంతెన నిర్మాణం సాగింది. అటల్ సేతు నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ప్రయోగించారు.

Advertisement

మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోను నిర్వహించారు. 2 కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద మోదీ పూజలు చేశారు. రోడ్‌షోలో మోదీతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఉన్నారు.

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×