E-Paper
Advertisement

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.

రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతును నిర్మించారు. ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ఇప్పటివరకు రెండు గంటల సమయం పడుతోంది. అటల్ సేతు ద్వారా ఆ దూరాన్ని 15- 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు . అందులో 16 కిలోమీటర్లలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకొనేలా ఈ వంతెన నిర్మాణం సాగింది. అటల్ సేతు నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ప్రయోగించారు.

మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోను నిర్వహించారు. 2 కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద మోదీ పూజలు చేశారు. రోడ్‌షోలో మోదీతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఉన్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×