BigTV English
Advertisement

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : అత్యంత పొడవైన సముద్రపు వంతెన.. అట్టహాసంగా అటల్ సేతు ప్రారంభోత్సవం..

Atal Setu : ముంబైలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు. ఎంటీహెచ్‌ఎల్‌కు ‘అటల్‌ సేతు’గా నామకరణం చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.


రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా అటల్ సేతును నిర్మించారు. ముంబై, నవీ ముంబై మధ్య ప్రయాణానికి ఇప్పటివరకు రెండు గంటల సమయం పడుతోంది. అటల్ సేతు ద్వారా ఆ దూరాన్ని 15- 20 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. వంతెన పొడవు 21.8 కిలోమీటర్లు . అందులో 16 కిలోమీటర్లలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. భూకంపాలను కూడా తట్టుకొనేలా ఈ వంతెన నిర్మాణం సాగింది. అటల్ సేతు నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ప్రయోగించారు.

మోదీ నాసిక్‌లో మెగా రోడ్‌షోను నిర్వహించారు. 2 కిలోమీటర్లకుపైగా ఈ రోడ్‌ షో కొనసాగింది. శ్రీకాలారాం మందిరంలో, గోదావరి నది ఒడ్డున ఉన్న రామకుండ్‌ వద్ద మోదీ పూజలు చేశారు. రోడ్‌షోలో మోదీతోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఉన్నారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×