E-Paper
Advertisement

Vijayasai Reddy: వాళ్లిద్దరూ అవిభక్త కవలలు

Vijayasai Reddy: వాళ్లిద్దరూ అవిభక్త కవలలు

-చంద్రబాబు సర్కార్ పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
-ఏపీలో కరువు, చంద్రబాబు ఇద్దరూ కవలలు
-వారి మధ్య విడదీయరాని సంబంధం
-రాయలసీమలో 54 కరువు మండలాలు ప్రకటించిన ఏపీ
-స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుంది
-కరువు అంతా చంద్రబాబు చలవే
-రైతుల ఉసురు తీస్తున్న బాబు
-ఈ ఏడారి అతివృష్టి, అనావృష్టి ప్రభావం

విశాఖపట్నం, స్వేచ్ఛ:

Vijayasai Reddy: చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం కొన్ని ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం, మరికొన్ని ప్రాంతాలలో అత్యల్ప వర్షపాతం నమోదయింది. దీనితో సరైన వర్షాలు లేక పంటలు పండించుకునేందుకు తగిన నీటి సౌకర్యాలు లేకుండా పోవడంతో చాలా వరకూ కరువు ప్రాంతాలుగా మిగిలిపోయాయి. దీనితో రాయల సీమలో 54 మండలాలను కరువు మండల ప్రాంతాలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 15 జారిచేసింది.
ఈ జీవోపై ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందించారు.

బాబు వస్తే కరువు వస్తుంది. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేది నానుడి. ఈ ఏడాది నైరుతి అనుకూలించినా రాయలసీమలో కరువు నీడలు వెంటాడుతున్నాయి. ఐదు జిల్లాలలో 54 మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం హయాంలో రైతులపై భారం పడకుండా ఐదేళ్ల పాటు పంటల బీమా కొనసాగించామన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే పంటల బీమా పథకాన్ని పక్కన పెట్టేసిందని.. బీమా ప్రీమియం కూడా రైతులే కట్టుకోవాలని చెబుతున్నారని అన్నారు. అనవసరంగా రైతుల ఉసురు తీస్తున్న ఈ ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారని అన్నారు.

Also Read: వివేకానంద హత్య కేసు.. ‘బిగ్ టీవీ’ ఇంటర్వ్యూలో సునీల్ కీలక విషయాలు, రేపో మాపో మాస్టర్ మైండ్ అరెస్ట్?

రాష్ట్రంలో కరువు తాండవం

ఇప్పటికే రాష్ట్రంలో దుర్భిక్షం మొద­లైంది. రాష్ట్రంలో 54 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించింది ఏపీ సర్కార్. ఇందుకు సంబంధించి జీవో 15 నారీ చేసింది. చిత్తూరు, అనంతపురం,కర్నూలు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి మండలాలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయిందని ప్రభుత్వమే తెలిపింది. 27 మండ­లాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరి­స్థితులు, 27 మండలాల్లో దుర్భిక్ష పరిస్థి­తులు నెలకొన్నా­యని పేర్కొంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×