E-Paper
Advertisement

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!

Vijayawada Walkers Protest: విజ‌య‌వాడ‌లో మార్కింగ్ వాక‌ర్స్ నిర‌స‌న‌.. చివ‌ర‌కు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మైదానంలోకి వెళ్లి!
Advertisement

విజ‌య‌వాడ ల‌యోలా కాలేజీ వ‌ద్ద వాక‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు ఉద‌యం నిర‌స‌న చేప‌ట్టారు. ప్ర‌తిరోజుల క‌ళాశాల మైదానంలో వాక‌ర్స్ వాకింగ్ చేస్తుంటారు. అయితే నేడు గేటు లోప‌లికి అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హానికి గురైన వాక‌ర్స్ గేటు ముందు ధ‌ర్నాకు దిగారు. వెంట‌నే త‌మ‌ను లోప‌లికి అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. గ‌త 25 సంవ్స‌రాలుగా న‌గ‌ర‌వాసులు ల‌యోలా కాలేజీ వాక‌ర్స్ పేరుతో మైదానంలో వాకింగ్ చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. దాదాపు మూడు వేల మంది స‌భ్యుల‌తో వాక‌ర్స్ ఉంద‌ని తెలిపారు.

అయితే క‌రోనా స‌మ‌యంలో క‌ళాశాల గేటును మూసి వేశారు. అప్పటి నుండి వాకింగ్ ట్రాక్ తెర‌వాలని అసోసియేష‌న్ వాళ్లు ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. ఈ విష‌యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా స‌మ‌స్య ప‌రిష్కారం అవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేవ‌లం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల‌కు మాత్ర‌మే క‌ళాశాల‌లో వాకింగ్ కు అనుమ‌తిస్తున్నార‌ని తెలిపారు.

Advertisement

ఎన్నిక‌ల స‌మ‌యంలో కూటమి స‌ర్కార్ అధికారంలోకి వ‌స్తే వాక‌ర్స్ కు అనుమ‌తి ఇచ్చేలా చూస్తామ‌ని, వాకింగ్ ట్రాక్ తెరిపిస్తామ‌ని నేత‌లు హామీ ఇచ్చారన్నారు. ఈ క్ర‌మంలోనే చాలా సార్లు వాకింగ్ ట్రాక్ తెర‌వాల‌ని క‌ళ‌శాల యాజ‌మాన్యాన్ని ఎన్నిసార్లు కోరినా అనుమ‌తి నిరాక‌రిస్తుండ‌టంతో క‌ళాశాల ముందు ధ‌ర్నా చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. సీనియ‌ర్ సిటిజ‌న్లు, న‌గ‌ర వాసుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వాక‌ర్స్ ను అనుమ‌తించాల‌ని డిమాండ్ చేశారు. చివ‌రికి గేటు తాళాలు ప‌గ‌ల‌గొట్టి లోప‌ల‌కి వెళ్లి వాకింగ్ చేశారు.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×