E-Paper
Advertisement

జగన్ టూర్ లో దారుణం, కారు చక్రాలకింద మనిషి తల.. ఆలస్యంగా బయటపడ్డ వీడియో

జగన్ టూర్ లో దారుణం, కారు చక్రాలకింద మనిషి తల.. ఆలస్యంగా బయటపడ్డ వీడియో

సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో జగన్ పర్యటన వివాదాలమయంగా మారిన సంగతి తెలిసిందే. అదే రోజు వాహనం ఢీకొని ఒకరు, అస్వస్థతకు గురై మరొకరు మరణించారు. ఈ రెండు మరణాలకు జగనే కారణం అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహం పెట్టేందుకు సత్తెనపల్లి వచ్చిన జగన్, ఇద్దరు అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారని అంటున్నారు. అయితే ఆ మరణాలకు, జగన్ పర్యటనకు సంబంధం లేదనేది వైసీపీ నేతల వాదన. సింగయ్య అనే వ్యక్తి ప్రమాదంలో చనిపోయాడు. నిన్నటి వరకు పోలీసులు కూడా వైసీపీ శ్రేణిలో అనుమతిలేని వాహనం ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగిందని అనుకున్నారు. కానీ ఈరోజు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్ కారు కిందే సింగయ్య నలిగిపోయినట్టు ఆ వీడియోలో ఉంది.

జగన్ రెంటపాళ్ల పర్యటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగన్‌ కారు ముందు టైర్‌ కింద సింగయ్య పడిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కారు కింద వృద్ధుడు పడినట్లు స్థానికులు అరిచారు. అయితే జగన్ వాహనం వెంటనే ఆగలేదు, వేగంగా ముందుకెళ్లింది. దీంతో ఆ వాహనం ముందుటైరు కింద సింగయ్య పడి నలిగిపోయినట్టు ఆ వీడియోలో ఉంది.

పబ్లిసిటీ స్టంట్‌ కోసం ప్రజల ప్రాణాలను గాల్లో కలుపుతున్నారంటూ జగన్ పై మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌. జగన్‌ కారు కిందపడి వృద్ధుడు సింగయ్య మరణించినట్టుగా వైరల్ అవుతున్న వీడియోపై మంత్రి స్పందించారు. బలప్రదర్శనకోసం జనంలోకి వచ్చిన జగన్ జనం ప్రాణాలను తీస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ మాదిరిగా దేశంలో ఏ ఒక్కరూ ప్రచారం కోరుకోరు అని అన్నారు గొట్టిపాటి. జగన్‌ కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే.. పక్కకు ఈడ్చేసి వెళ్లిపోయారని, తన కారుకింద పడి వృద్ధుడు చనిపోయినా జగన్ కి పశ్చాత్తాపం లేదన్నారు.

ఇక వైసీపీ వెర్షన్ మరోలా ఉంది. సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసిందని అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్‌ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని స్వయంగా ఎస్పీ చెప్పారని, టాటా సఫారీ వాహనం ఢీకొన్నట్టుగా కూడా ఆయన ప్రకటించారని, ఇప్పుడీ కొత్త వీడియో ఎక్కడిదని వారు నిలదీస్తున్నారు. టాటా సఫారీ ఢీకొని సింగయ్య మరణించాడని స్వయంగా ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత టీడీపీ కుట్రకు తెరలేపిందని అంటున్నారు వైసీపీ నేతలు.

కొత్తగా బయటకు వచ్చిన వీడియోపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఆ వీడియోలో ఉన్నది సింగయ్యేనా, మరో వ్యక్తా, ఒకవేళ అది సింగయ్యే అయితే ఆ గాయాలతోనే అతను చనిపోయాడా అనేది పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో జగన్ కి, వైసీపీకి మరింత డ్యామేజీగా మారింది.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×