E-Paper
Advertisement

Vizag YSR View Point name changed: ఏపీలో మార్పులు మొదలయ్యాయా? మారిన వైఎస్సార్ వ్యూ పాయింట్

Vizag YSR View Point name changed: ఏపీలో మార్పులు మొదలయ్యాయా? మారిన వైఎస్సార్ వ్యూ పాయింట్
Advertisement

Vizag YSR View Point name changed(AP latest news): ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. నాలుగైదు రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముందుగానే మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. విశాఖ‌లో ఒకప్పుడు వివాదానికి కేంద్రంగా మారిన వైఎస్ఆర్ వ్యూ పాయింట్‌ పేరు అర్థరాత్రి మార్చేశారు.

మంగళవారం అర్థరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ పేరుపై అబ్దుల్ కలాం పేరిట స్టిక్కర్లు అంటించారు. దీంతో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం తెలియ గానే వైసీపీ అభిమానులు ఉదయం విశాఖ బీచ్‌కు వచ్చారు. దీనిపై పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు.

Advertisement

విశాఖ బీచ్‌కు సమీపంలో సీతకొండ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో వ్యూ పాయింట్‌ను అధికారులు అభివృద్ధి చేశారు. అధికారుల పర్మిషన్‌తో దాన్ని వైఎస్సార్ వ్యూపాయింట్‌గా మార్చారు. ఆ సమయంలో అధికార వైసీపీ-టీడీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు తారాస్థాయికి చేరాయి.

ALSO READ: నేడు చంద్రబాబు ఢిల్లీ పయనం.. NDA కీలక భేటీ

Advertisement

తాజాగా ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోగానే వైఎస్సార్ వ్యూపాయింట్‌ పేరు అబ్దుల్ కలాం వ్యూపాయింట్‌గా మార్చడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వ్యతిరేకించిన కూటమి అభిమానులు తిరిగి అబ్దుల్ కలాం పేరు కనిపించేలా వ్యూ పాయింట్ వద్ద స్టిక్కర్లు అతికించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇరుపార్టీల నేతలు దీనిపై సైలెంట్‌గా వున్నారు. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×