E-Paper
Advertisement

Visakha MLC by Elections: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి దూరం

Visakha MLC by Elections: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కూటమి దూరం
Advertisement

Visakha MLC by Elections: ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీకి కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు కూటమితో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మెజార్టీ నేతల అభిప్రాయాల మేరకు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడం కష్టమేమి కాదని, హుందా రాజకీయాలు చేయాలని సీఎం వెల్లడించారు.

సీఎం చంద్రబాబుతో టెలీకాన్ఫరెన్స్‌లో విజయం సాధించేందుకు అవసరమైన బలం లేనందున పోటీ చేయకపోవడమే మంచిదని కూటమి నాయకులు సైతం చెప్పారు. అలాగే ఒక ఎమ్మెల్సీ సీలు కోల్పోయినంత మాత్రాన వచ్చే నష్టమేమీ కాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

Advertisement

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 838 ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కనీసం 420 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూటమికి 300 మాత్రమే ఉన్నాయి. అయితే గెలిచేందుకు ఇంకా 120 ఓట్లు అవసరం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఆ 120 ఓటర్లను సమీకరించుకునేందుకు అధికార పార్టీకి ఉంది. కానీ హుందా రాజకీయాలు చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోటీకి కూటమి దూరంగా ఉండనుంది.

Also Read: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. జోగి రాజీవ్ అరెస్ట్

Advertisement

ఇదిలా ఉండగా, విశాఖ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా.. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకుంటే ఎకగ్రీవం కానుంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×