E-Paper
Advertisement

విశాఖ మెట్రోకు మళ్లీ ఏమైంది? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి, రైట్స్ కొర్రీలు

విశాఖ మెట్రోకు మళ్లీ ఏమైంది? ఓ అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి, రైట్స్ కొర్రీలు
Advertisement

Visakha Metro: విశాఖ సిటీ మెట్రో రైలు వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఓ అడుగు ముందుకేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోందా? రైట్స్ కన్సల్టెన్సీ నివేదిక‌తో కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడిందా? కేవలం గాజువాక నుంచి హనుమంతవాకకు పరిమితం చేసిందా? దీనిపై ఏపీ ప్రభుత్వం మాటేంటి? ఏ విధంగా అడుగులు వేయనుంది?

విశాఖ మెట్రో కారిడార్‌‌కు మళ్లీ గ్రహణం

Advertisement

విశాఖపట్నం సిటీ డబుల్‌ డెక్కర్‌ మెట్రో కారిడార్‌‌ ప్రతిపాదనలు కేంద్రం చేతికి చేరాయి. 20 కిలోమీటర్లు మేరా డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనిపై సర్వే చేసిన రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ తెరపైకి కొత్త సిఫార్సులు తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం 20 కిలోమీటర్ల మేరా ప్రతిపాదనలు చేసింది. కానీ రైట్స్ కన్సల్టెన్సీ మాత్రం కేవలం 13 కిలోమీటర్లు చాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.

కేవలం ఈ కారిడార్ గాజువాక నుంచి హనుమంతవాక వరకు సరిపోతుందని సూచించినట్టు తెలుస్తోంది. విశాఖలో 140.13 కిలోమీటర్లు మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి దశలో 46.23 కిలోమీటర్లు రూ.11,498 కోట్లతో ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదనలు చేసింది. నగరం మధ్యలోని నేషనల్ హైవే దగ్గర ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ నిర్మిస్తామని ప్రస్తావించింది.

Advertisement

రైట్స్ కొర్రీలు.. కేంద్రం ఏమంటుందో?

లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ప్లాన్ చేసింది. అదే సమయంలో మెట్రో రైలు ప్రాజెక్టు బదులు డబుల్ డెక్కర్ కారిడార్ ను తెరపైకి తెచ్చింది. 20 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ ను ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌. డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను స్టీల్‌ప్లాంట్‌ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు కాగా, తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్లు ఉండాలని ప్లాన్ చేసింది.

దీనికి భూసేకరణ లేకుండా నేషనల్ హైవే మధ్యలో ఈ నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ విధంగా డిజైన్ చేసింది. రాష్ట్ర మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ కేంద్రానికి ఈ ప్రతిపాదనలు, డీపీఆర్‌ను పంపింది. డబుల్‌ డెక్కర్‌ ప్రతిపాదనల్ని కుదించాలని రైట్స్‌ సంస్థ కేంద్రానికి సిఫార్సు చేయడంతో ఇంతకీ మెట్రో ప్రాజెక్టు అడుగు పడుతుందా లేదా అన్నదానిపై చర్చ మొదలైంది.

ALSO READ: ఏఎంబీ సినిమాస్‌లో నమ్రత, సితారలతో పాటు ప్రియాంక చోప్రా సందడి.. వైరల్ అవుతున్న పిక్స్..

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×