Big Stories

Visakhapatnam : విశాఖలో ఉద్రిక్తత.. నాదెండ్ల మనోహర్ అరెస్ట్..

janasena latest updates

Visakhapatnam news today(Breaking news in Andhra Pradesh):

విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టైకూన్ హోటల్ దగ్గర రహదారి మూసివేతకు నిరసనగా జనసేన మహాధర్నా చేపట్టింది. ఎంపీ MVV సత్యనారాయణకు వ్యక్తిగత లబ్ధి చేయడానికే ఈ రహదారి మూసివేశారని జనసేన ఆరోపిస్తోంది. ఎంపీకి చెందిన నిర్మాణాలకు వాస్తు దోషం తొలగించేందుకు రోడ్డు మూసివేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌‌తో పాటు కార్యకర్తలు అక్కడకు చేరుకొని నిరసన చేపట్టారు.

- Advertisement -

సెక్షన్ 30 అమలులో ఉండటంతో.. జనసేన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ధర్నాకు దిగిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌తో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నోవాటెల్ హోటల్ వద్ద జనసేన కార్యకర్తలతో పాటు నాదెండ్ల మనోహర్ నిరసన తెలిపారు. దీంతో పోలీసులు నాదెండ్ల మనోహర్‌ను అరెస్ట్ చేశారు.

Visakhapatnam news today
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News