E-Paper
Advertisement

Vishaka: అమ్మకానికి విలువైన ఉక్కు భూములు.. రండిబాబు రండి..

Vishaka: అమ్మకానికి విలువైన ఉక్కు భూములు.. రండిబాబు రండి..
Advertisement
vishaka steel plant

Vishaka news today(Latest news in Andhra Pradesh): విశాఖ ఉక్కు విషయంలో 100శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటోంది కేంద్రం. ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేసింది. విశాఖ హౌజింగ్ బోర్డ్ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మేందుకు అధికారులు నిర్ణయించారు. ఆటోనగర్‌లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లు, పెదగంట్యాడలో 434.75 చదరపు గజాల్లో ఉన్న 8 ఇళ్లను.. RINL అమ్మకానికి పెట్టింది. నగరం నడిబొడ్డున హెచ్‌బీ కాలనీలో అమ్మకానికి పెట్టిన ఈ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,500 కోట్లకు పైనే ఉంటుంది. ఆటోనగర్‌లోని 2 ఎకరాలు రూ.100 కోట్ల వరకు ధర పలుకుతోంది.

స్థలాలు అమ్మి.. స్టీల్ ప్లాంట్ నిర్వహించాలన్న ఆలోచనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా వచ్చే నగదుతో ఇప్పటికిప్పుడు ప్లాంటు అవసరాలు తీరుతాయి కానీ.. ఆ తర్వాత పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్రకటనతో ఉక్కు ఆస్తులపై కొందరు పావులు కదుపుతున్నారని.. విలువైన ఆస్తులను తక్కువ ధరలకు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టేలా అడుగులు పడుతున్నాయంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ నగరంలోని విలువైన ఉక్కు ఆస్తులను కేంద్రమే ఆధీనంలో పెట్టుకుని సున్నా వడ్డీకి రుణసాయం చేస్తే ప్లాంటు నిలదొక్కుకునే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెబుతున్న మాట.

Advertisement

విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మకాలపై స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ మండిపడుతున్నారు. వేల కోట్లు విలువైన ఆస్తులు.. కావాలని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం.. తక్కువ ధరలు నిర్ణయించి అమ్మకానికి పెట్టిందని ఆరోపిస్తున్నారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×