E-Paper
Advertisement

Twitter: ట్విటర్‌కు మోదీ సర్కార్ బెదిరింపులు.. జాక్ డోర్సే సంచలనం.. కేంద్రం ఆగ్రహం

Twitter: ట్విటర్‌కు మోదీ సర్కార్ బెదిరింపులు.. జాక్ డోర్సే సంచలనం.. కేంద్రం ఆగ్రహం
Advertisement
twitter modi

Twitter: మోడీ ప్రభుత్వం, భారత్‌లో ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయ్‌. రైతులు నిరసనల సమయంలో భారత్‌ ప్రభుత్వం తమను తీవ్ర ఒత్తిడికి గురి చేసిందని ఆరోపించారు. రైతుల నిరసనలపై వస్తున్న సానుకూల స్పందనలను ట్విట్టర్​ నుంచి తొలగించాలని.. లేదంటే ఇండియాలో ట్విట్టర్‌ను మూసేస్తామంటూ మోడీ ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ఉద్యోగుల ఇళ్లపై రైడ్లు నిర్వహిస్తామని బెదిరించిందన్నారు. కొందరిపై రైడ్స్ చేశారని ఆరోపించారు. ఇది ఇండియా.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటూ కామెంట్స్‌ చేశారు జాక్‌ డోర్సే. ఆయన మాటలు సోషల్​ మీడియాలో వైరల్‌గా మారాయ్‌. విపక్షాలు.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

మరోవైపు జాక్‌ డోర్స్‌ కామెంట్స్ కు కౌంటరిచ్చారు కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌. జాక్‌ డోర్సే చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. ట్విట్టర్‌ చాలా సార్లు భారత్‌ చట్టాలను ఉల్లంఘించిందని గుర్తు చేశారు. ఈ విషయంపై హెచ్చరిస్తే.. ఇలాంటి మోసపూరిత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరీపై రైడ్స్‌ చేసి జైలుకు పంపలేదని స్పష్టం చేశారు రాజీవ్‌ చంద్రశేఖర్‌.

Advertisement

2020లో మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది కేంద్రం. దీనికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. లక్షలాది మంది రైతులు ఉద్యమించారు. 2021 నవంబర్​ వరకు ఆందోళనలు కొనసాగాయి. రైతులకు సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. చివరికి దిగొచ్చిన ప్రభుత్వం.. రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×