E-Paper
Advertisement

BJP vs TDP: కూటమిలో సిగపట్లు.. ఆ జిల్లాలో భగ్గుమంటున్న టీడీపీ.. అసలు కథ ఇదే!

BJP vs TDP: కూటమిలో సిగపట్లు.. ఆ జిల్లాలో భగ్గుమంటున్న టీడీపీ.. అసలు కథ ఇదే!
Advertisement

BJP vs TDP: ఏపీలో కూటమి సిగపట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలలో చేరికలు ఏమో కానీ, సిగపట్లు పెద్ద చిక్కులే తెస్తున్నాయట ఆ పార్టీల అగ్ర నాయకులకు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఓ నేత, బీజేపీలో చేరారు. అది కూడా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో చేరడం విశేషం. దీనితో వైజాగ్ కూటమిలో యుద్ధ ప్రాతిపదికన చీలికలు బయటపడుతున్నాయని టాక్.

ఇటీవల విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి లు వైసీపీ కి రాజీనామా చేశారు. ఎన్నికల అనంతరం రాజీనామాలు చేసిన వీరు, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయ చాతుర్యం ప్రదర్శించి అధికార కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సేఫ్ అనుకున్నారో ఏమో గానీ ఆనంద్ కుమార్, రమాదేవి లు బీజేపీ కండువా కప్పుకున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

Advertisement

ఇప్పుడు ఇదే ఇక్కడ పొలిటికల్ వార్ కు దారి తీసింది. కూటమిలో భాగమైన బీజేపీ ఒక్క మాట కూడా చెప్పకుండా, కూటమి ఓటమి కోసం తాపత్రయ పడ్డ వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని స్థానిక టీడీపీ నాయకులు గరం అవుతున్నారట. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో గల చింతకాయల విజయ్ ఈ విషయంపై సీరియస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

పార్టీలు మారాలనుకునే వాళ్లను కూటమి నాయకుల అభిప్రాయాలను తీసుకోకుండా జాయినింగ్ చేసుకోవడంతో నాయకుల్లో చిచ్చు రోజురోజుకు అధికమవుతుందట. పురందేశ్వరి పోటీ చేసిన పార్లమెంటులో ఆమెకు తెలియకుండా, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను టీడీపీ లోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటూ కూడా టీడీపీ నేతలు యమ ఫైర్ అవుతున్నారట. కూటమిలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ, కమ్యూనికేట్ చేసుకోవడం అవసరం అంటూ చింతకాయల విజయ్ కరఖండిగా చెప్పినట్లు సమాచారం.

Advertisement

Also Read: Living In Relationship: పెళ్ళికి ముందే సహజీవనం చేస్తే.. ఆ జంట విడాకులు తీసుకునే అవకాశాలు తగ్గుతాయా?

ఈ కామెంట్స్ తో స్థానిక బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారట. మా పార్టీలో చేరికలపై ఇతర పార్టీల నేతలతో చర్చించాల్సిన అవసరం లేదని, అది పార్టీ వ్యవహారమంటూ తేల్చి చెప్పేస్తున్నారు. మొత్తం మీద వైజాగ్ పాలిటిక్స్ ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి. బీజేపీలో చేరికలు ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారం కాగా, విజయ్ కామెంట్స్ ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చే స్థితిలో ఉన్నాయని పొలిటికల్ టాక్. టీడీపీ అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించి, లుకలుకలకు ఫుల్ స్టాప్ పెట్టాలని హితభోద చేసినట్లు సమాచారం.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×