E-Paper
Advertisement

Vizag Fire Accident: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన రోగులు!

Vizag Fire Accident: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. బయటకు పరుగులు తీసిన రోగులు!
Advertisement

Vizag Fire Accident in Hospital: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో ఉన్న సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అగ్రి ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఆరో అంతస్తు భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భయభ్రాంతులతో వైద్యులు, పేషెంట్స్, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఈ మంటలు అడ్మిన్ బ్లాకులో చెలరేగినట్లు ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 30 నిమిషాలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతకుముందు మంటలు చెలరేగిన వెంటనే ఆస్పత్రి సిబ్బంది పేషంట్లతోపాటు ఇతరులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలోని ఇతర బ్లాక్‌లలోకి మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. పేషంట్స్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also read: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్

Advertisement

ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖపట్నంలోని మెడికవర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పట్టణంలో జరిగిన ఈ సంఘటన భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే మరో ఘటన జరగడంతో ఆస్పత్రికి వచ్చేందుకు రోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×