E-Paper
Advertisement

Vizag Fishing Harbor : ఫిషింగ్ హార్బర్ ఘటనలో వీడిన మిస్టరీ.. బోట్లను తగలబెట్టిన సిగరెట్

Vizag Fishing Harbor : ఫిషింగ్ హార్బర్ ఘటనలో వీడిన మిస్టరీ.. బోట్లను తగలబెట్టిన సిగరెట్
Advertisement
Vizag Fishing Harbor news

Vizag Fishing Harbor news(Breaking news in Andhra Pradesh) :

సంచలనంగా మారిన విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన అనేక మలుపులు తీసుకుంది. చివరికి పోలీసులు ఈకేసులో ఓ కంక్లూజన్‌కి వచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని.. ఇందులో కుట్రకోణం ఏమీ లేదని పోలీసులు తేల్చారు. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నెల 19 సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. బోట్ నెంబర్ 887లో ఇద్దరూ మద్యం తాగి, ఫిష్ ఫ్రై చేసుకుని పార్టీ చేసుకున్నారని చెప్పారు. మద్యం మత్తులో పక్కన ఉన్న 815 నంబర్ బోటుపై సిగరెట్ పీలిక పడేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పెద్దగా గాలి రావడంతో.. ఆ సిగరెట్ పీలిక చేపల వలకు అంటుకుంది. ఆ తర్వాత మంటలు బోటు ఇంజన్ కు విస్తరించాయన్నారు. అలా మిగిలిన బోట్లకు మంటలు వ్యాపించి కాలిపోయాయని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన తర్వాత అక్కడి నుంచి నిందితులిద్దరూ మెల్లగా జారుకున్నారని విశాఖ సీపీ చెప్పారు.

Advertisement

ఈ కేసు విచారణలో భాగంగా మొత్తం ముగ్గురు నానిలను విచారించినట్టు సీపీ తెలిపారు. ఇందులో భాగంగా యూట్యూబర్ నానిని కూడా ప్రశ్నించామని అన్నారు. కానీ.. ఇంతలోనే యూట్యూబర్ నాని ఫ్యామిలీ లీగల్ ప్రొసీజర్ ఫాలో అయిందని చెప్పారు. చాలా సున్నితమైన, ప్రమాదకరమైన ఈ కేసులో నిందితులెవరో తేలిందని.. కొంతమేర ఇబ్బంది పడినా.. దర్యాప్తును చివరి దశకు తీసుకొచ్చామని చెప్పారు. 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించి ఇన్ని రోజులు ఆధారాలు సేకరించామని అన్నారు. మొత్తానికి నిందితుల్ని అరెస్ట్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×