E-Paper
Advertisement

Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?

Visakhapatnam: తప్పతాగి ట్రాఫిక్ ఎస్సైని కొట్టిన నేవీ ఆఫీసర్.. తర్వాత ఏమైందంటే?
Advertisement

Visakhapatnam: విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేవీ ఆఫిసర్ వీరంగం సృష్టించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి..  మద్యం మత్తులో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా  విధుల్లో ఉన్న పోలీసులపై భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

మల్కాపురం సమీపంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) పైప్‌లైన్ పనులు జరుగుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో..  ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్న రాహుల్ కృష్ణన్ తన వాహనంలో VDR జంక్షన్ నుండి సింధియా జంక్షన్ వైపు అతివేగంగా దూసుకొచ్చారు. రహదారి మూసివేసి ఉండటంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాసరావు,  ఇతర సిబ్బంది ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

Advertisement

మద్యం మత్తులో ఉన్న రాహుల్ కృష్ణన్..  పోలీసులు అడ్డుకోవడాన్ని సహించలేకపోయారు. కారు దిగి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎస్సై శ్రీనివాసరావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ..  నిందితుడు విచక్షణ కోల్పోయి ఆయనపై దాడికి తెగబడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి అని కూడా చూడకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ భౌతిక దాడికి పాల్పడటంతో అక్కడున్న సిబ్బంది షాక్‌కు గురయ్యారు.

 వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా..  మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. బాధితుడైన ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదు మేరకు మల్కాపురం లా అండ్ ఆర్డర్ పోలీసులు రాహుల్ కృష్ణన్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు  అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన రక్షణ రంగ అధికారి ఇలాంటి ఉన్మాద చర్యకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ALSO READ: Alluri district: తండ్రీకొడుకుల ప్రాణం తీసిన కోడిపుంజు.. నర్సింగ పేటలో తీవ్ర విషాదం!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×