E-Paper
Advertisement

విశాఖలో కాంక్రేజ్ ఎద్దుల సందడి.. రోజుకు 15 లీటర్ల పాలిచ్చే ఆవు..

విశాఖలో కాంక్రేజ్ ఎద్దుల సందడి.. రోజుకు 15 లీటర్ల పాలిచ్చే ఆవు..

Kankrej Cow Bull: విశాఖపట్నంలోని సింహాచలం సమీపంలో జరుగుతున్న శబల భోజనాల పండగ సందడి పల్లె వాతావరణాన్ని తలపిస్తోంది. ఆధునిక నగర జీవనంలో పాత తరం ఆరోగ్య రహస్యాలను, దేశీయ వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఉత్సవంలో రాజస్థాన్.. గుజరాత్ సరిహద్దు ప్రాంతాల నుండి తీసుకువచ్చిన ‘కాంక్రేజ్’ (Kankrej) జాతి ఎద్దు, ఆవు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుమారు రూ. 2.5 లక్షల భారీ వ్యయంతో వీటిని ఇక్కడికి తీసుకువచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. చూడటానికి గంభీరంగా, భారీ కొమ్ములతో భయంకరంగా కనిపిస్తున్నప్పటికీ, ఇవి మనుషులతో ఎంతో స్నేహపూర్వక(ఫ్రెండ్లీ)గా ఉంటాయని యజమానులు చెబుతున్నారు.

ఈ ఉత్సవానికి హైలైట్‌గా నిలుస్తున్న కాంక్రేజ్ ఆవులు రోజుకు 8 నుండి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయని విజయనగరానికి చెందిన గోశాల నిర్వాహకుడు దొడ్డ మహేష్ వివరించారు. సాధారణంగా దేశీయ ఆవులు తక్కువ పాలు ఇస్తాయనే అపోహను తొలగించి, రైతులకు లాభసాటిగా ఉండే బ్రీడ్లను పరిచయం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని కచ్ ప్రాంతానికి చెందిన ఈ జాతి పశువులు ఎటువంటి కఠినమైన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగలవని, మన ప్రాంతపు క్లైమేట్‌కు కూడా ఇవి త్వరగా అలవాటు పడతాయని ఆయన వెల్లడించారు.

కేవలం పాల కోసమే కాకుండా, కాంక్రేజ్ ఎద్దులు వ్యవసాయ పనుల్లో అత్యంత బలంగా పనిచేస్తాయని నిర్వాహకులు తెలిపారు. పాత తరం పద్ధతుల్లో దేశీయ ఎద్దులతో సాగు చేయడం ద్వారా పండించే పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ శబల భోజనాల పండగ వేదికగా చాటిచెబుతున్నారు. ఈ ఎద్దులు ఎంత బరువునైనా సులువుగా మోయగల సామర్థ్యం కలిగి ఉంటాయని, వీటిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఈ ప్రదర్శనలో కాంక్రేజ్‌తో పాటు పుంగనూరు, సాహివాల్, రాఠి, తార్‌పార్కర్, గిర్ వంటి మరో ఎనిమిది రకాల దేశీయ గోవులను కూడా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు.

సిటీ ప్రజలకు పల్లెటూరి రుచులను, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను పరిచయం చేయడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు తిన్న ఆహార పదార్థాలు, వాడిన దేశీయ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. “మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే దేశీయ ఆవు పాలు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులే మార్గం” అని శబల నిర్వాహకులు పేర్కొంటున్నారు. గంభీరమైన కొమ్ములు, భారీ రూపంతో కనిపిస్తున్న ఈ కాంక్రేజ్ ఎద్దులు, ఆవుల వద్ద ఫొటోలు దిగేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి ఒడిలో దేశీయ పశు సంపదను కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ ఉత్సవం సమర్థవంతంగా అందిస్తోంది.

Read Also: డైనోసార్ తోలుతో హ్యాండ్ బ్యాగ్.. రూ.4 కోట్లు ఉంటే మీ సొంతం!

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×