E-Paper
Advertisement

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘటన… ఎస్ఎంఎస్‌లో ప్రమాదం, కార్మికులకు గాయాలు

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘటన… ఎస్ఎంఎస్‌లో ప్రమాదం, కార్మికులకు గాయాలు
Advertisement

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు ఉద్యోగుల ఆందోళన మరోవైపు ప్రమాదాలు కలిసి కార్మికులకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఎల్‌పీబేస్టీల్ ల్యాడిల్‌ డిపార్టు మెంట్‌లో ఈ ఘటన జరిగింది. సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావుతోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకోగానే కార్మికులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

ALSO READ:  ఏపీలో నామినేటెడ్ పదవులు.. తొలి విడతలో

మల్లేశ్వరరావు శరీరం దాదాపు 80 శాతం కాలినట్లు ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి.  ల్యాడిల్ నుంచి ద్రావకం లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు ఉద్యోగులు చెబుతున్నమాట. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏం జరిగిందనే దానిపై కార్మికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

ఈ ఏడాది జనవరిలో కూడా ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్-3లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అధికారులు స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కార్మికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకుంది. చీటికీ మాటికీ ఘటనలు జరగడంతో అసలు ప్లాంట్‌లో ఏం జరుగుతోందన్న చర్చ అప్పుడు విశాఖ ప్రజల్లో మొదలైంది.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×