BigTV English

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

Ysrcp Leaders Missing: సాయం లేదు.. సమాచారం లేదు.. వరదల్లో మిస్సయ్యరా?

Ysrcp Leaders Missing: ఏపీలో రాజకీయాలంటే.. ముందుగా బెజవాడ నేతలే గుర్తొస్తారు. ప్రస్తుతం మచ్చుకైనా కనిపించలేదెందుకు? వైసీపీ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారా? ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని భావించిన నేతలే ఇరుకున పడ్డారా? పదేళ్లు విజయవాడ సెంట్రిక్‌గా రాజకీయాలు సాగాయి. చంద్రబాబు సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నేతల నోటి మాట కాదు కాదా, కనిపించిన సందర్భం లేదు. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది?


 

ఆ నేతలెక్కడ?

వైసీపీ ప్రభుత్వం ఓ వెలుగు వెలిగారు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు. టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకు పడేవారు. బూతు పురాణం మొదలుపెట్టారనుకోండి. ఆ జిల్లాలో ఒక్క నేత కూడా కనిపించలేదు. వారిలో పేర్ని నాని (అప్పుడప్పుడు కనిపిస్తున్నారు), వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కనీసం బెజవాడ వరదల సమయంలో వీళ్ల జాడ కనిపించలేదు. అధినేత జగన్ ఇచ్చిన సలహాను ఫాలో అవుతున్నారా? కావాలనే వీళ్లంతా రాజకీయాలకు దూరంగా ఉన్నారా? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


 

అప్పట్లో అలా..?

రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొద్దిరోజులు హింస.. మరి కొద్దిరోజులు హింస. అఫ్‌కోర్స్.. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోందనుకోంది. జగన్ సర్కార్‌లో పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి నేతలంతా మంత్రులుగా కొనసాగారు. ఒకరిద్దరు తప్పితే.. ఆ సమయంలో ఆయా నేతలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అవినీతి అనేది కాసేపు పక్కనబెడదాం. కనీసం టీడీపీ నేతలు రోడ్ల మీదకు రాకుండా పోలీసుల ద్వారా అణిచివేశారు.

 

ప్రజలకు దూరంగా..?

చంద్రబాబు సర్కార్‌లో అలాంటిదేమీ లేవుగానీ.. చాలామంది వైసీపీ నేతలు బయటకు రావడానికి వణుకుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కారణం ఏమైనా కావచ్చు. కనీసం తమ నియోజకవర్గంలో ప్రజలు నీటిలో మునిగిపోతున్నా, ఏ ఒక్కరూ బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. బెంగుళూరు నుంచి వచ్చిన ప్రతీసారి అధినేత జగన్ మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు.

ALSO READ: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ నిర్ణయాలపై ఆమోదం..

ఇంతకీ ఆయా నేతలు ఆ పార్టీలో ఉన్నారా? మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజలను వెంటాడు తున్నాయి. చాలామంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీఇన్నీకావు. ఇప్పుడు అవే వారిని వెంటాడుతున్నాయి. అరెస్టుల భయానికి దూరంగా ఉంటున్నారు. ఈ లెక్కన ఆయా నేతలు తప్పు చేసినట్టేనని ఒప్పుకున్నట్లయ్యింది. ఈ క్రమంలోనే ఆయా నేతలు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

 

అప్పుడు.. ఇప్పుడు బొత్సదే హవా?

పార్టీలో ఏదైనా విషయంపై మాట్లాడినప్పుడు కేవలం బొత్స సత్యనారాయణను ముందు పెడుతుంది ఆ పార్టీ. ఇప్పుడు అదే చేస్తోంది. బెజవాడలో అంతమంది వైసీపీ నేతలుండగా, వరద సాయంపై బొత్స రంగంలోకి దించింది ఆ పార్టీ. దీనిపై రకరకాలుగా చర్చించుకోవడం కృష్ణా జిల్లా వాసుల వంతైంది. రాబోయే ఐదేళ్లు ఇలాగే కంటిన్యూ అవుతారా? లేక బయటకు వస్తారా? అనే డౌట్ చాలామందిని వెంటాడుతోంది.

Related News

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

Big Stories

×